తెలంగాణ

telangana

ETV Bharat / bharat

"ప్రతిపక్షాలకు మళ్లీ అదేగతి"

బాలాకోట్​లోని ఉగ్ర స్థావరాలపై భారత వైమానిక దళం దాడులను ప్రతిపక్షాలు రాజకీయం చేయటం తగదని విత్త మంత్రి అరుణ్​ జైట్లీ తప్పుబట్టారు.

By

Published : Mar 3, 2019, 8:39 PM IST

ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు అరుణ్​ జైట్లీ

బాలాకోట్​లోని జైషే మహమ్మద్​ ఉగ్ర సంస్థ స్థావరాలపై దాడిని దేశమంతా సమర్థించిందని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్​ జైట్లీ అన్నారు. ప్రతిపక్షాలు మాత్రం ఆ అంశాన్ని రాజకీయం చేశాయని ట్విట్టర్​లో పేర్కొన్నారు.

విపక్షాలు దేశ ప్రయోజనాలకు భంగం కలిగించేలా ప్రవర్తిస్తున్నాయని జైట్లీ అన్నారు. ఈ అంశాలు శత్రుదేశ మీడియాకు మనదేశంపై ఆరోపణలు చేసేందుకు అవకాశమిచ్చాయని అన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రతిపక్షాలు మళ్లీ అదే స్థానంలో ఉంటాయని భావిస్తున్నట్లు జైట్లీ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details