తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నేడు కమల 'గళపతి'కి అంతిమ వీడ్కోలు

శనివారం తుదిశ్వాస విడిచిన భాజపా సీనియర్​ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్​ జైట్లీ అంత్యక్రియలు నేడు జరగనున్నాయి. దిల్లీలోని నిగంబోధ్​ఘాట్​లో మధ్యాహ్నం 2.30 గంటలకు అంత్యక్రియలు జరుగుతాయని భాజపా వర్గాలు వెల్లడించాయి.

By

Published : Aug 25, 2019, 5:41 AM IST

Updated : Sep 28, 2019, 4:29 AM IST

నేడు కమల 'గళపతి'కి అంతిమ వీడ్కోలు

కేంద్ర మాజీమంత్రి, భాజపా సీనియర్ నేత అరుణ్​ జైట్లీ అంత్యక్రియలు నేటి మధ్యాహ్నం పూర్తవనున్నాయి. గత కొంతకాలంగా దిల్లీ ఎయిమ్స్​లో చికిత్స పొందుతున్న జైట్లీ... శనివారం ఆరోగ్యం క్షీణించి తుదిశ్వాస విడిచారు.

నిగంబోధ్​ఘాట్​లో అంత్యక్రియలు

ఉదయం 10 గంటల వరకు కైలాశ్​నగర్‌లోని జైట్లీ నివాసంలోనే ఆయన పార్థివ దేహాన్ని ఉంచనున్నారు. తర్వాత భాజపా కార్యాలయానికి తరలిస్తారు. అక్కడ 11 గంటల నుంచి 1.30 నిమిషాల వరకు ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. మధ్యాహ్నం 1.30కు జైట్లీ అంతిమయాత్ర ప్రారంభం అవుతుంది. మధ్యాహ్నం 2.30 నిమిషాలకు యమునా తీరంలోని నిగంబోద్‌ఘాట్‌లో జైట్లీ అంతిమ సంస్కారాలు జరుగుతాయని భాజపా వర్గాలు వెల్లడించాయి.

ఇదీ చూడండి: 'భాజపా ట్రబుల్​ షూటర్​గా జైట్లీ ముద్ర ప్రత్యేకం'

Last Updated : Sep 28, 2019, 4:29 AM IST

ABOUT THE AUTHOR

...view details