తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పాక్​ దురాగతానికి మరో భారత జవాన్ బలి

పాకిస్థాన్​ మరోసారి భారత సైన్యంపై కాల్పులకు పాల్పడింది. జమ్ముకశ్మీర్​ పూంచ్​ జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి ఉన్న గ్రామాలు లక్ష్యంగా దాడులకు తెగబడింది. పాక్ దుశ్చర్యలో భారత జవాన్​ ఒకరు మరణించారు. మరో నలుగురు సైనికులు గాయపడ్డారు.

By

Published : Aug 20, 2019, 5:34 PM IST

Updated : Sep 27, 2019, 4:29 PM IST

పాక్​ దురాగతానికి భారత జవాన్ బలి

జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దుతో రగిలిపోతున్న పాకిస్థాన్‌.. కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. జమ్ము కశ్మీర్​లోని పూంచ్​ జిల్లాలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. సరిహద్దు వెంబడి ఉన్న భారత సైనిక స్థావరాలు, గ్రామాలు లక్ష్యంగా పాకిస్థాన్ సైన్యం దాడులకు పాల్పడింది. ఫలితంగా భారత జవాన్​ ఒకరు మృతి చెందారు. మరో నలుగురు సైనికులు గాయపడ్డారు.

భారత సైన్యం వెంటనే స్పందించి పాకిస్థాన్​ సైనిక స్థావరాలపై దాడి చేసిందని, పాక్​ సైనికులను మట్టుపెట్టిందని రక్షణ శాఖ అధికారులు తెలిపారు.

వీర మరణం పొందిన జవాన్​ నాయక్​ రవి రంజన్​ కుమార్​ సింగ్​ (36)... బిహార్​కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. నాయక్​ ఎంతో ధైర్యవంతుడని, నిజాయతీపరుడని, దేశానికి ఆయన సేవలు మరువలేనివని అధికారులు అన్నారు.

ఇదీ చూడండి:హైఅలర్ట్​: దేశంలోకి ప్రవేశించిన ఐఎస్​ఐ ముఠా!

Last Updated : Sep 27, 2019, 4:29 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details