తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఉగ్రభూతంపై భారత్​, మయన్మార్ ఉమ్మడి పంజా

భారత్​, మయన్మార్​లు 'ఆపరేషన్​ సన్​రైజ్' పేరుతో ఈశాన్య రాష్ట్రాల్లో పలు ఉగ్రస్థావరాలను ధ్వంసం చేశాయి. సుమారు 75 మంది ముష్కరులను అదుపులోకి తీసుకున్నాయి.​

By

Published : Jun 17, 2019, 6:06 AM IST

Updated : Jun 17, 2019, 7:10 AM IST

తీవ్రవాదులపై పంజా విసిరిన భారత్​, మయన్మార్ సైన్యాలు

భారత్​, మయన్మార్​ సైన్యాలు సంయుక్తంగా తమ సరిహద్దు ప్రాంతాల్లోని ఉగ్రస్థావరాలపై భారీ ఆపరేషన్​ చేపట్టాయి. మణిపుర్​, నాగాలాండ్​, అసోంలోని ముష్కర స్థావరాలను ధ్వంసం చేశాయి. గత నెల 16 నుంచి మూడు వారాల పాటు ఆపరేషన్ జరిగిందని రక్షణ అధికారులు వెల్లడించారు.

భారత్​-మయన్మార్​ మధ్య 1,645 కి.మీ సరిహద్దు ఉంది. తీవ్రవాదం ఎక్కువగా ఉండే మణిపుర్​, నాగాలాండ్ సహా పలు ఈశాన్య రాష్ట్రాలతో మయన్మార్ సరిహద్దు పంచుకుంటోంది.

ఆపరేషన్​ సన్​రైజ్​-1

ముష్కరుల ఆట కట్టించేందుకు ఇరుదేశాల సైన్యాలు మూడు నెలల కిందట 'ఆపరేషన్​ సన్​రైజ్​' పేరుతో దాడులు నిర్వహించాయి. పలు తీవ్రవాద స్థావరాలను నేలమట్టం చేశాయి.

కాలాదాన్​ రవాణా ప్రాజెక్టును వ్యతిరేకించే అరాకన్ ఆర్మీ అనే వేర్పాటువాద ముఠాను లక్ష్యంగా చేసుకుని భారత సైన్యం ఈ ఆపరేషన్​ చేపట్టింది.

ఆపరేషన్​ సన్​రైజ్​-2

గత నెలలో చేపట్టిన ఆపరేషన్ సన్​రైజ్​-2లో ఇరుదేశాల సైన్యాలు కలిసి కేఎల్​ఓ, ఎన్​ఎస్​సీఎన్ (ఖాప్లాంగ్​), ఉల్ఫా (ఐ), ఎన్​డీఎఫ్​బీ తదితర తీవ్రవాద ముఠాల స్థావరాలను ధ్వంసం చేశాయి. సుమారు 75 మంది మిలిటెంట్లను నిర్బంధంలోకి తీసుకున్నాయి.

క్షేత్రస్థాయి పరిస్థితులు, నిఘా సమాచారం ఆధారంగా మరో విడత ఆపరేషన్​ నిర్వహించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.

ఇదీ చూడండి: సంక్షోభం: నీళ్లు లేవు... భోజనం పెట్టలేం..!

Last Updated : Jun 17, 2019, 7:10 AM IST

ABOUT THE AUTHOR

...view details