తెలంగాణ

telangana

ETV Bharat / bharat

"ప్రశ్నిస్తారనే భయంతోనే వయనాడ్​కు రాహుల్"

కేరళలోని వయనాడ్ లోక్​సభ స్థానం నుంచి కూడా పోటీ చేయాలన్న కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ నిర్ణయాన్ని భాజపా అధ్యక్షుడు అమిత్​ షా ఎద్దేవా చేశారు. అమేఠీ ప్రజలు ప్రశ్నిస్తారనే భయంతోనే రాహుల్​ కేరళకు వెళ్లారని ఆరోపించారు

By

Published : Mar 31, 2019, 6:08 PM IST

రాహుల్​ గాంధీపై అమిత్​ షా విమర్శలు

అమేఠీ ప్రజలు మాకేం చేశారని ప్రశ్నిస్తారనే భయంతోనే కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​గాంధీ వయనాడ్​కు వెళ్లారని భాజపా అధ్యక్షుడు అమిత్​ షా ఆరోపించారు. రాహుల్...​ దేశంలో ఎక్కడికెళ్లినా ప్రజలు ప్రశ్నిస్తూనే ఉంటారని ఎద్దేవా చేశారు. దేశ రక్షణను పణంగా పెట్టి కాంగ్రెస్​ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడిందని విమర్శించారు.

రాహుల్​ గాంధీపై అమిత్​ షా విమర్శలు

" రాహుల్​ గాంధీ అమేఠీ వదిలి కేరళకు వెళ్లిపోయారు. ఎందుకు వెళ్లారో మీకందరికీ తెలుసు. ఇక్కడి ప్రజలు ఓడిస్తారనే భయంతోనే కేరళకు వెళ్లి గెలవాలని చూస్తున్నారు. సోనియాగాంధీ, మన్మోహన్​ సింగ్ హయాంలోని కాంగ్రెస్​ ప్రభుత్వం... సంఝౌతా ఎక్స్​ప్రెస్​ బాంబుదాడిలోని పాకిస్థాన్​ ఉగ్రసంస్థ లష్కరే తోయిబాకు క్లీన్​చిట్​ ఇచ్చింది. దోషులను విడిచిపెట్టి అమాయకులను జైలుకు పంపి దేశ రక్షణను ప్రమాదంలో పడేసింది."

-అమిత్​ షా, భాజపా అధ్యక్షుడు

పశ్చిమ ఉత్తరప్రదేశ్​లోని 8 లోక్​సభ స్థానాలకు ఏప్రిల్​ 11న ఎన్నికలు జరగనున్నాయి. 2014 ఎన్నికల ఫలితాల్లో ఇక్కడి అన్ని స్థానాల్లోనూ భాజపా విజయకేతనం ఎగురవేసింది.

ABOUT THE AUTHOR

...view details