తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రసాయన పరిశ్రమలో పేలుడు.. 15 మంది మృతి

మహారాష్ట్ర ధూలే జిల్లాలో ఓ రసాయన పరిశ్రమలో జరిగిన పేలుడులో 15 మంది మరణించారు. 58 మందికి గాయాలయ్యాయి. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షల పరిహారం ప్రకటించారు రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్​. ప్రమాద ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్​ షా విచారం వ్యక్తం చేశారు.

By

Published : Aug 31, 2019, 7:00 PM IST

Updated : Sep 28, 2019, 11:56 PM IST

రసాయన ఫ్యాక్టరీలో పేలుడు.. 15 మంది మృతి

రసాయన ఫ్యాక్టరీలో పేలుడు.. 15 మంది మృతి

మహారాష్ట్ర ధూలే జిల్లాలోని ఓ రసాయన పరిశ్రమలో ఘోర ప్రమాదం జరిగింది. శిర్పూర్ తాలూకాలోని వాఘాడి గ్రామంలో ఉన్న పరిశ్రమలో.. ఈ ఉదయం సిలిండర్లు పేలి మంటలు చెలరేగాయి. పేలుడు ధాటికి 15 మంది మరణించారు. 58 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ధూలే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

పేలుడుకు కారణాలు:

ప్రమాదం జరిగిన 'రుమిత్​ చెమ్సింత్​ ప్రైవేట్​ లిమిటెడ్​' ఫ్యాక్టరీలో ఔషధాలకు సంబంధించిన రసాయనాల​ను తయారు చేస్తారు. ఈ ప్రక్రియలో ఎక్కువ మొత్తంలో నైట్రోజన్​ గ్యాస్​ సిలిండర్లను, రసాయనాలతో నిండిన బారెల్స్​ను ఉపయోగించడం వల్ల పేలుడు తీవ్రత పెరిగిందని అధికారులు తెలిపారు.

ఉదయం 9 గంటల 45 నిమిషాల ప్రాంతంలో విస్ఫోటం సంభవించింది. ప్రమాద సమయంలో సుమారు 100 మంది అక్కడ పనిచేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మంటల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయక బృందాలు ముమ్మరంగా చర్యలు చేపట్టాయి.

సీఎం పరామర్శ

ప్రమాదంలో మరణించిన వారికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్​ సంతాపం తెలుపుతూ... మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షల పరిహారం ప్రకటించారు.

హోంమంత్రి విచారం

ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్​ షా విచారం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడణవీస్​కు ఫోన్ చేసి పేలుడుకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.

ఇదీ చూడండి:ఇతడి పారాగ్లైడింగ్​​ చూస్తే పొట్ట చెక్కలవ్వాల్సిందే!

Last Updated : Sep 28, 2019, 11:56 PM IST

ABOUT THE AUTHOR

...view details