తెలంగాణ

telangana

ETV Bharat / bharat

"నెగ్గితే ఈసీని 2 రోజులు జైల్లో పెడతా"

'భారిప్​ బహుజన్​ మహాసంఘం' అధ్యక్షుడు ప్రకాశ్​ అంబేడ్కర్​ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను నెగ్గితే ఈసీని  రెండు రోజులు జైల్లో పెడతానని అన్నారు. పుల్వామా ఉగ్రదాడిపై రాజకీయ పార్టీలను ఈసీ మాట్లాడనివ్వకుండా కట్టడి చేసిందని అంబేడ్కర్​ ఆగ్రహం వ్యక్తం చేశారు.

By

Published : Apr 5, 2019, 9:13 AM IST

SDF

బీఆర్​ అంబేడ్కర్​ మనవడు ప్రకాశ్​ అంబేడ్కర్​ వివాదంలో చిక్కుకున్నారు. మహారాష్ట్ర యావత్​మల్​ జిల్లాలో జరిగిన సభలో ఆయన ఈసీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.

"పుల్వామా ఉగ్రదాడిలో మనం 40 మంది వీర జవాన్లను కోల్పోయాం. అయినా నిశ్శబ్దంగా ఉన్నాం. మనల్ని ఈ దాడిపై మాట్లడకూడదన్నారు. ఈసీ ఈ విధంగా ఎలా కట్టడి చేస్తుంది? రాజ్యాంగం మనకు భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చింది. నేను భాజపాలా కాదు. ఎన్నికల్లో గెలిస్తే.. ఈసీని రెండు రోజులు జైల్లో వేస్తా"
-ప్రకాశ్​ అంబేడ్కర్​, భారిప్​ బహుజన్​ మహాసంఘ్ అధ్యక్షుడు

ఈ వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం గురువారం స్పందించింది. ప్రకాశ్​ చేసిన ప్రసంగంపై నివేదిక సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక ఎన్నికల అధికారులను ఆదేశించింది. ప్రకాశ్​ అంబేడ్కర్​ నిబంధనలను ఉల్లంఘించినట్లు స్పష్టం చేసింది. ఆయనపై యావత్​మల్ జిల్లా కలెక్టర్​ దిగ్రాస్​ పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. షోలాపూర్​, అకోలా నియోజకవర్గాల నుంచి ప్రకాశ్​ ఎన్నికల బరిలో నిలిచారు.

ABOUT THE AUTHOR

...view details