తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అగ్రనేతల 'అనధికార సమావేశం' కోసం సర్వం సిద్ధం

భారత్​లో పర్యటించనున్న చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​.. శుక్రవారం దిల్లీ చేరుకోనున్నారు. అక్కడి నుంచి మోదీతో కలిసి చెన్నైలోని మామల్లపురంకు వెళ్లనున్నారు జిన్​పింగ్​. ఈ అనధికారిక సమావేశం కోసం సాంస్కృతిక ప్రదర్శన, విందు కార్యక్రమాలను ఏర్పాటు చేశారు అధికారులు.

By

Published : Oct 10, 2019, 5:02 AM IST

Updated : Oct 10, 2019, 8:00 AM IST

అగ్రనేతల 'అనధికార సమావేశం' కోసం సర్వం సిద్ధం

అగ్రనేతల 'అనధికార సమావేశం' కోసం సర్వం సిద్ధం

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ- చైనా అధ్యక్షుడు షీ జిన్​పింగ్ మధ్య జరగనున్న అనధికారిక సమావేశం కోసం సర్వం సిద్ధమైంది. మోదీతో సమావేశం కోసం శుక్రవారం మధ్యాహ్నం దిల్లీకి చేరుకోనున్నారు జిన్​పింగ్​. అనంతరం చెన్నై సమీపంలోని చారిత్రక పట్టణం మామల్లపురంకు చైనా అధ్యక్షుడిని తీసుకెళ్తారు ప్రధాని. అక్కడే ఓ ప్రత్యేక సాంస్కృతిక ప్రదర్శనను ఏర్పాటు చేశారు అధికారులు. ఆ తర్వాత జిన్​పింగ్​కు మోదీ ప్రత్యేక విందును ఇవ్వనున్నారు.

ఈ అనధికారిక సమావేశంలో ఇరు దేశాల మధ్య ఎలాంటి ఒప్పందాలు జరగనప్పటికీ.. మోదీ-జిన్​పింగ్​ ఉన్నతస్థాయి చర్చలు జరపనున్నారు. ఇందుకోసం చెన్నై తీరానికి సమీపంలోని ఓ రిసార్టు వేదికకానుంది. వాణిజ్యం, ఉగ్రవాదం, ఆర్థిక సమస్యలపై ఈ చర్చలు జరిగే అవకాశమున్నట్టు సమాచారం.

12న కూడా అగ్రనేతల మధ్య భేటీ జరగనుంది. ఆ తర్వాత ఉన్నతస్థాయి సమావేశం ఉంటుందని అధికారులు తెలిపారు. శనివారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో జిన్​పింగ్​.. చెన్నై నుంచి నేపాల్​కు వెళ్లే అవకాశముంది.

2018 ఏప్రిల్​లో మోదీ-జిన్​పింగ్​ మధ్య ఇప్పటికే ఓ అనధికారిక సమావేశం జరిగింది. సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించి భారత ప్రధానిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన అనంతరం జిన్​పింగ్​తో మోదీ భేటీ కావడం ఇది మూడోసారి.

మోదీతో పాటు జాతీయ భద్రతా సలహాదారు అడిత్​ డోభాల్​, భారత విదేశాంగమంత్రి జయ్​శంకర్​ చెన్నైకు పయనమవుతారు. చైనా పోలిట్​ బ్యూరో సభ్యుడు, చైనా విదేశాంగమంత్రి జిన్​పింగ్​తో పాటు భారత్​లో పర్యటించనున్నారు.

ఇదీ చూడండి:- మోదీ-జిన్​పింగ్​ భేటీ మామల్లపురంలోనే ఎందుకు?

Last Updated : Oct 10, 2019, 8:00 AM IST

ABOUT THE AUTHOR

...view details