తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అజిత్​ డోభాల్​కు కేంద్ర కేబినెట్​ హోదా

జాతీయ భద్రతా సలహాదారు అజిత్​ డోభాల్​కు కేబినెట్​ హోదా ప్రకటించింది కేంద్రం. మరో ఐదేళ్లపాటు భద్రతా సలహాదారు పదవిలో కొనసాగిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

By

Published : Jun 3, 2019, 4:44 PM IST

Updated : Jun 3, 2019, 6:01 PM IST

అజిత్​ డోభాల్​

అజిత్​ డోభాల్​కు కేంద్ర కేబినెట్​ హోదా

జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్​కు అరుదైన గౌరవం లభించింది. ఆయనకు కేంద్ర కేబినెట్​ హోదా ప్రకటించినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా జాతీయ భద్రతా సలహాదారుగా మరో ఐదేళ్ల పాటు డోభాల్​ను​ కొనసాగించనున్నారు. గత ప్రభుత్వంలో సహాయ మంత్రి హోదాలో సేవలందించారు డోభాల్​.

జాతీయ భద్రత అంశాల్లో ఆయన చేసిన విశేష సేవలకు గుర్తింపుగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఎన్​ఎస్​ఏగా బాధ్యతలు చేపట్టకముందు ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్​గా పనిచేశారు డోభాల్.

2016లో పీఓకేలో భారత్​ జరిపిన లక్షిత దాడులు, 2019లో బాలాకోట్​ ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడుల్లో కీలకంగా వ్యవహరించారు. డోక్లాం విషయంలో చైనాతో పరిస్థితులను చక్కబెట్టింది కూడా డోభాలే. 1999లో కాందహార్​ హైజాక్​ సమయంలో ఉగ్రవాదులతో చర్చలు జరిపిన బృందంలోనూ ఆయన కీలక వ్యక్తి.

ఉత్తరాఖండ్​ (ఒకప్పటి ఉమ్మడి ఉత్తరప్రదేశ్​)లో 1945లో జన్మించారు డోభాల్. 1968 బ్యాచ్​ కేరళ కేడర్​ ఐపీఎస్​ అధికారిగా కెరీర్​ను ప్రారంభించారు. 2005లో ఐబీ డైరెక్టర్​గా పదవీ విరమణ పొందారు. 2014లో మోదీ ప్రభుత్వంలో ఐదో జాతీయ భద్రతా సలహాదారుగా నియమితులయ్యారు డోభాల్.

ఇదీ చూడండి: 13 మందితో భారత యుద్ధ విమానం గల్లంతు

Last Updated : Jun 3, 2019, 6:01 PM IST

ABOUT THE AUTHOR

...view details