తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లెక్క తేలింది..!

ఫిబ్రవరి 26 నాటి భారత వాయుసేన దాడుల్లో సుమారు 300 మంది మృతి చెందినట్లు జాతీయ సాంకేతిక పరిశోధన సంస్థ అంచనా వేసింది. వైమానిక దాడికి ముందు అక్కడ 3 వందల ఫోన్లు సిగ్నళ్లు అందుకున్నాయని తేల్చింది.

By

Published : Mar 4, 2019, 9:28 PM IST

వైమానిక దాడిలో మూడువందలమంది మృతిపై ఎన్​టీఆర్​ఓ అంచనా

ఫిబ్రవరి 26న భారత వాయుసేన బాలాకోట్ ఉగ్రస్థావరాలపై చేసిన దాడుల్లో సుమారు 300 వందల మంది మృతి చెందినట్లు అంచనా వేసింది జాతీయ సాంకేతిక పరిశోధన సంస్థ( ఎన్​టీఆర్ఓ). వైమానిక దాడికి ముందు ఘటనా స్థలి నుంచి 300 ఫోన్​ నెంబర్లు సిగ్నళ్లు అందుకున్నాయన్న సాంకేతిక సమాచారం ఆధారంగా ఈ నిర్ధరణకు వచ్చింది.

భారత వాయుసేనకు చెందిన 12 మిరాజ్ యుద్ధ విమానాలు పాక్ ఆక్రమిత కశ్మీర్​ లోకి వెళ్లి దాడులు చేశాయి. ఈ ఘటనలో ఎంతమంది మృతి చెందారన్న విషయంపై పాకిస్థాన్ అధికారిక ప్రకటన ఏదీ విడుదల చేయలేదు.

వైమానిక దాడికి ముందు వరకు 300 ఫోన్లకు సిగ్నళ్లు అందాయని సాంకేతిక నిఘా ఆధారంగా కనిపెట్టినట్లు ఓ అధికారి స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details