తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఈడీ ఎదుట విచారణకు హాజరైన రాజ్​ఠాక్రే

ఐఎల్​ అండ్ ఎఫ్​సీ కేసులో ఈడీ ఎదుట విచారణకు మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్​ఠాక్రే హాజరయ్యారు. ఆయన అభిమానులు దక్షిణ ముంబయిలోని ఈడీ కార్యాలయం ఎదుటు గుమిగూడకుండా... ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు అక్కడ 144 సెక్షన్ విధించారు.

By

Published : Aug 22, 2019, 11:40 AM IST

Updated : Sep 27, 2019, 8:55 PM IST

ఈడీ ఎదుట విచారణకు హాజరైన రాజ్​ఠాక్రే

మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్​ ఠాక్రే... ఐఎల్​ అండ్ ఎఫ్​సీ అక్రమ నగదు చలామణి కేసులో ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో దక్షిణ ముంబయిలోని ఈడీ కార్యాలయం వద్ద పోలీసులు 144 సెక్షన్​ విధించారు.

మహారాష్ట్ర నవనిర్మాణ సేన కార్యకర్తలు ఈడీ కార్యాలయం వద్ద గుమిగూడకుండా, ఎలాంటి అల్లర్లు జరుగకుండా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. మధ్య ముంబైలోని దాదర్​ ప్రాంతంలోనూ భద్రతను కట్టుదిట్టం చేశారు. ముందు జాగ్రత్త చర్యగా పలువురు ఎమ్​ఎన్ఎస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.

అభిమానులారా రావొద్దు...

ఈడీ కార్యాలయం వద్దకు తన అభిమానులు ఎవరూ రావొద్దని రాజ్​ఠాక్రే విజ్ఞప్తి చేశారు.

ఈడీ ఎదుట విచారణకు హాజరైన రాజ్​ఠాక్రే

ఇదీ కేసు

దాదర్ ప్రాంతంలో కోహినూర్​ స్క్వేర్ టవర్ అభివృద్ధి సంస్థకు సంబంధించి, 450 కోట్ల అక్రమ నగదు చలామణి జరిగిందని ఈడీ కేసు నమోదు చేసింది. ఈ కేసు విషయమై విచారణకు హాజరుకావాలని ఈడీ రాజ్​ఠాక్రేకు నోటీసులు ఇచ్చింది. ఇదే కేసులో మాజీ ముఖ్యమంత్రి, శివసేన సీనియర్ నేత మనోహర్ జోషి కుమారుడు ఉమేశ్​ జోషికి కూడా ఈడీ సమన్లు జారీ చేసింది.

ఇదీ చూడండి: 'పాక్​కు భారత జలాల నిలిపివేత ప్రక్రియ ప్రారంభం'

Last Updated : Sep 27, 2019, 8:55 PM IST

ABOUT THE AUTHOR

...view details