తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కాంగ్రెస్​, ఆప్​ మధ్య కుదరని పొత్తు

దిల్లీలో కాంగ్రెస్​, ఆమ్​ ఆద్మీ పార్టీలు ఒంటరిగానే పోటీ చేయనున్నాయి. 2 పార్టీల మధ్య పొత్తు చర్చలు విఫలమయ్యాయి.

By

Published : Apr 12, 2019, 6:44 PM IST

కాంగ్రెస్ ఆప్​

కాంగ్రెస్, ఆమ్​ ఆద్మీ పార్టీల పొత్తు చర్చలు విఫలమయ్యాయి. ఫలితంగా రెండు పార్టీలు ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయనున్నాయి. దిల్లీతో పాటు మిగతా ప్రాంతాల్లోనూ పొత్తుపై చర్చించాలని ఆప్ ప్రతిపాదించగా ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా తిరస్కరించామని కాంగ్రెస్ నేత పీసీ చాకో తెలిపారు.

పీసీ చాకో, కాంగ్రెస్ నేత

" దేశమంతా కాంగ్రెస్ విధానమొక్కటే. మహాకూటమిని ఏర్పరచి భాజపాను ఓడించాలి. ఇందుకోసం ఆమ్​ ఆద్మీతో చర్చించాము. అయితే దిల్లీలో చేసినట్టే ఇతర ప్రాంతాల్లోనూ పొత్తు ఉండాలని ఆప్ అంటోంది. ఇతర రాష్ట్రాల్లో ఆప్​తో పొత్తు పెట్టుకునేందుకు రాజకీయ పరిస్థితులు అనుకూలంగా లేవు. ఈ స్థితిలో కలిసి పోటీ చేయటం కుదరలేదు. ఒంటరిగానే పోటీ చేస్తున్నాం."

- పీసీ చాకో, కాంగ్రెస్ నేత

ఆప్​తో జేజేపీ పొత్తు

హరియాణాలో జననాయక జనతా పార్టీతో కలిసి ఆమ్​ ఆద్మీ పార్టీ పోటీ చేయనుంది. రాష్ట్రంలోని 10 లోక్​సభ స్థానాల్లో ఆప్​ 3, జేజేపీ 7 సీట్లలో బరిలో నిలవనున్నాయి.

హరియాణాలో కాంగ్రెస్​, జేజేపీలతో పొత్తుకు ఆప్ ప్రతిపాదించింది. అయితే కాంగ్రెస్ తిరస్కరణతో మిగిలిన రెండు పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి.

ఇవీ చూడండి: జయప్రదతో ఆజంఖాన్​ ముఖాముఖి..!

ABOUT THE AUTHOR

...view details