తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గౌతం గంభీర్​పై కోర్టులో ఆమ్​​ఆద్మీ ఫిర్యాదు

తూర్పు దిల్లీ నుంచి భాజపా తరఫున లోక్​సభ ఎన్నికల బరిలో నిలిచిన మాజీ క్రికెటర్​ గౌతం గంభీర్​పై దిల్లీలోని తీస్​​ హజారీ కోర్టులో ఆమ్​ఆద్మీ పార్టీ ఫిర్యాదు చేసింది. గంభీర్​కు రెండు ఓటర్​ గుర్తింపు కార్డులు ఉన్నాయంటూ అభ్యంతరం వ్యక్తం చేసింది.

By

Published : Apr 26, 2019, 9:13 PM IST

Updated : Apr 27, 2019, 12:26 AM IST

గౌతం గంభీర్​పై కోర్టులో ఆమ్​​ఆద్మీ ఫిర్యాదు

గౌతం గంభీర్​పై కోర్టులో ఆమ్​​ఆద్మీ ఫిర్యాదు

తూర్పు దిల్లీ నుంచి భాజపా తరపున లోక్ సభ ఎన్నికల బరిలో ఉన్న మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్‌ వివాదంలో చిక్కుకున్నారు. గంభీర్‌కు రెండు ఓటర్ కార్డులు ఉన్నాయంటూ దిల్లీలోని తీస్​ హజారీ కోర్టులో ఆమ్‌ఆద్మీ పార్టీ ఫిర్యాదు చేసింది. ఈ అంశంపై కోర్టులో ఫిర్యాదు చేసినట్టు ఆమ్​ఆద్మీ పార్టీ అభ్యర్థిని అటిషి మార్లెనా ట్విట్టర్‌లో తెలిపారు.

దిల్లీలోని కరోల్‌బాగ్‌, రాజేంద్రనగర్‌ రెండు నియోజకవర్గాల్లోనూ గంభీర్‌కు ఓట్లు ఉన్నట్లు ఆమె ఆరోపించారు. ప్రజాప్రాతినిథ్య చట్టంలోని సెక్షన్‌ 125-ఏ ప్రకారం ఇది నేరమని, దీనికి ఆరు నెలల వరకు జైలు శిక్ష విధించొచ్చని అన్నారు.

కొద్ది రోజుల్లో ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగా ప్రకటించబోయే వ్యక్తికి ఓటేయడం వృథా అని ఆమ్​ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్​ కేజ్రివాల్​ గంభీర్​ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు.

మరోవైపు భాజపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న గంభీర్‌పై అనవసర వివాదాలు సృష్టించేందుకు ఆప్ ప్రయత్నిస్తోందని దిల్లీ భాజపా అధ్యక్షుడు మనోజ్ తివారి విమర్శించారు. ఎన్నికల్లో ఓటమి భయంతోనే ఆమ్​ఆద్మీ ఇలాంటి ఆరోపణలు చేస్తోందని తివారీ అన్నారు.

Last Updated : Apr 27, 2019, 12:26 AM IST

ABOUT THE AUTHOR

...view details