తెలంగాణ

telangana

ETV Bharat / bharat

యువతి తిట్టిన బూతులకు పోలీసులే పరార్​

మహారాష్ట్ర పుణెలో పోలీసులకే చుక్కలు చూపించింది ఓ మహిళ. రాత్రి వేళ రోడ్లపై 3 కార్లను ధ్వంసం చేసిందన్న కారణంతో ఆమె ఇంటికి వెళ్లిన పోలీసులపై 'బూతుల దాడి' చేసింది. ఆ అసభ్య పదజాలాన్ని తట్టుకోలేక పోలీసులు అక్కడి నుంచి జారుకోక తప్పలేదు.

By

Published : Aug 21, 2019, 6:24 PM IST

Updated : Sep 27, 2019, 7:25 PM IST

యువతి

పోలీసులపై యువతి బూతుల దాడి

మహారాష్ట్ర పుణెలో కారుతో ఓ మహిళ బీభత్సం సృష్టించింది. హింజెవాడిలో తన వాహనంతో మూడు కార్లను ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టింది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తం అయ్యాయి. వీటి ఆధారంగా కార్ల యజమానులతో సహా పోలీసులు మహిళ ఇంటికి వెళ్లారు.

పోలీసులను చూడగానే అంతెత్తున లేచింది ఆ యువతి. అసభ్య పదజాలంతో దూషించింది. "ఈ రోజు కార్లనే కొట్టాను. రేపు మనుషుల మీదనుంచి పోనిస్తాను. ఏం చేయగలరు?" అంటూ హెచ్చరించింది. అందులో ఒకరు వీడియో తీయడాన్ని గమనించి... "వివస్త్రను చేసి అప్పుడు తీయండి" అంటూ ఆమె చేసిన వికృత చేష్టలకు పోలీసులు నివ్వెరపోయారు. చేసేది లేక అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అయింది.

ఆమె మానసిక పరిస్థితిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. లేదా మద్యం మత్తులోనైనా ఇలా చేసి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు.

ఇదీ చూడండి: ట్రాఫిక్ ఉల్లం'ఘను'లకు మరో 10 రోజుల తర్వాత వాతే!

Last Updated : Sep 27, 2019, 7:25 PM IST

ABOUT THE AUTHOR

...view details