తెలంగాణ

telangana

రెండేళ్ల చిన్నారికి దెయ్యం పట్టిందని కొట్టి చంపేశాడు!

కర్ణాటకలో మూఢనమ్మకాల భూతవైద్యానికి రెండేళ్ల చిన్నారి బలయింది. చిన్నారికి ఒంట్లో బాగోలేదని భూతవైద్యుడి దగ్గరికి తీసుకెళ్లారు తల్లిదండ్రులు. వైద్య పేరిట జిల్లేడు కర్రలతో చితకబాది పాపాయి ప్రాణాలు తీశాడు ఆ రాక్షసుడు.

By

Published : Sep 28, 2020, 4:46 PM IST

Published : Sep 28, 2020, 4:46 PM IST

a-vampire-kills-the-two-year-old-in-pretend-of-exorcism-parents-alleged-on-magician
రెండేళ్ల చిన్నారికి దెయ్యం పట్టిందని..కొట్టి చంపేశాడు!

కర్ణాటక చిత్రదుర్గంలో రెండేళ్ల చిన్నారి ప్రాణాలు తీశాడో భూతవైద్యుడు. అజ్జిక్యాతనహల్లి గ్రామానికి చెందిన ప్రవీణ్, బేబీల రెండేళ్ల పాపాయికి ఈ మధ్య ఒంట్లో బాగుండటం లేదు. కాస్త చికాకుగా ఉంటోదని.. ఆ గ్రామానికి భూతవైద్యుడిగా గుర్తింపు పొందిన రాకేశ్ దగ్గరికి తీసుకెళ్లారు. ప్రవర్తనలో మార్పుకు కారణం ఆమెపై దెయ్యం సోకడమేనని చిన్నారి తల్లిదండ్రులను నమ్మించాడు రాకేశ్.

చిన్నారి ఒంటిపై గాయాలు...

చిన్నారికి పట్టిన దెయ్యం వదిలించేందుకు భూత వైద్యం మొదలెట్టాడు. జిల్లేడు కొమ్మలతో ఇష్టం వచ్చినట్లు కొట్టాడు. చిత్రహింసలు తాళలేక అక్కడిక్కడే కుప్పకూలింది ఆ పసిపాప. తల్లిదండ్రుల ఎదుటే తుదిశ్వాస విడిచింది.

రెండేళ్ల చిన్నారికి దెయ్యం పట్టిందని..కొట్టి చంపేశాడు!

ఇదీ చదవండి:ఆయన చెవిలో మారుమోగుతున్న 253 విదేశీ రేడియోలు!

For All Latest Updates

TAGGED:

exorcism

ABOUT THE AUTHOR

...view details