మేక్ యువర్ ప్రజెన్స్ బృందం సంగీతంతో ఓటు ప్రాముఖ్యంపై అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు ముంబయికి చెందిన యువకులు. ఇందుకోసం 'ర్యాప్ మ్యూజిక్'ను ఎంచుకున్నారు. 'మేక్ యువర్ ప్రజెన్స్' అనే పేరుతో బృందాన్ని ఏర్పాటు చేసుకుని అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు.
ఓటు హక్కు ప్రాముఖ్యం, యువత పాత్రపై పాటల రూపంలో నూతన పద్ధతుల్లో అవగాహన కల్పిస్తున్నారు.
" సంగీతంతో ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు మేమంతా ప్రయత్నిస్తున్నాం. అందుకు ర్యాప్ను ఒక సాధనంగా ఎంచుకున్నాం. ఆంగ్లం, హిందీ, మరాఠీ భాషల్లో పాడగలిగిన నలుగురు ర్యాపర్లు ఉన్నారు. "
- చైతన్య ప్రభు, బృందం వ్యవస్థాపకుడు
తాము పాడే పాటల్లో ప్రస్తుత తరం ఏం చేస్తోంది, ఎలా ప్రవర్తిస్తోంది, ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనడానికి ఎందుకు ఇష్టపడటం లేదు అనే అంశాలను ప్రముఖంగా ప్రస్తావిస్తున్నట్లు చెప్పారు ప్రభు. అన్ని పాటల్లో 'పెహ్లా ఓట్.. పెహ్లా ప్యార్' అనేది చాలా ప్రాచుర్యం పొందిందని తెలిపారు.
ఇదీ చూడండి: వైరల్: పోలీసులను హడలెత్తించిన మొసలి