తెలంగాణ

telangana

టపాసులు తిని మరో గజరాజు మృతి!

By

Published : Jun 22, 2020, 12:50 PM IST

Updated : Jun 22, 2020, 4:30 PM IST

కేరళలో పేలుడు పదార్థాలు తిని మరణించిన ఏనుగు తరహాలోనే తమిళనాడులో మరో గజరాజు ఆకతాయిల రాక్షసత్వానికి బలైంది. కొద్ది రోజుల క్రితమే నోటికి తీవ్ర గాయమై తల్లడిల్లిన ఆ ఏనుగు కన్నుమూసినట్లు కోయంబత్తూర్​ అటవీ శాఖ అధికారులు వెల్లడించారు.

a-12-year-old-male-elephant-died-after-eating-crackers-at-jambukandi-village-in-outskirts-of-coimbatore
టపాసులు తిని మరో గజరాజు మృతి!

తమిళనాడు కోయంబత్తూరు జిల్లాలో కొద్ది రోజుల క్రితం పేలుడు పదార్ధాలు తిన్న ఓ గజరాజు.. జంబుకండి గ్రామ శివారులో శవమై కనిపించింది.

కొద్ది రోజుల క్రితం కేరళలో గర్భిణి గజం నోటికి గాయమైనట్టే కోయంబత్తూర్​ మంగారాయ్ ప్రాంతంలో ఓ 12 ఏళ్ల గజరాజు గాయపడి కనిపించడం చర్చనీయాంశమైంది. సమాచారమందుకున్న అటవీ శాఖ అధికారులు ఏనుగుకు వైద్య పరీక్షలు చేయించారు. కేరళ ఏనుగు తరహాలోనే.. ఈ ఏనుగు నోటికి గాయాలు ఉన్నట్లు గుర్తించారు.

టపాసులు తిని మరో గజరాజు మృతి!

అడవి పందుల కోసం అక్రమ వ్యాపారులు ఏర్పాటుచేసిన పేలుడు పదార్థాలను తినడం వల్లే ఇది గాయపడిందని భావించిన అధికారులు దర్యాప్తు చేపట్టారు. వాస్తవాలు తెలిసేలోపే ప్రాణాలు పిండేస్తున్న నొప్పిని భరించలేక.. ఆ గజరాజు ప్రాణాలు విడిచింది.

ఇదీ చదవండి:ఏనుగు నోటికి గాయం- టపాసులే కారణం?

Last Updated : Jun 22, 2020, 4:30 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details