తెలంగాణ

telangana

ETV Bharat / bharat

73 రాజ్యసభ స్థానాలకు ఈ ఏడాదే ఎన్నికలు

ఈ ఏడాది 73 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 69 మంది పదవీ కాలం పూర్తి కానుండగా.. మరో నాలుగు స్థానాలు ఇప్పటికే ఖాళీగా మారాయి. ఈ నేపథ్యంలో సభ్యులను ఎన్నుకునేందుకు అవకాశం ఉందని తెలుస్తోంది.

By

Published : Jan 4, 2020, 6:53 AM IST

Updated : Jan 4, 2020, 9:41 AM IST

73 Rajya Sabha seats to see election this year, maximum held by BJP
ఈ ఏడాదిలో 73 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు

73 రాజ్యసభ స్థానాలకు ఈ ఏడాదే ఎన్నికలు

పెద్దల సభ అయిన రాజ్యసభలో 73 స్థానాలకు ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత సభ్యుల్లో 69 మంది పదవీ కాలం ఈ ఏడాదే పూర్తికానుందని.. రాజ్యసభ సచివాలయం విడుదల చేసిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మరో నాలుగు సీట్లు ఇప్పటికే ఖాళీగా మారాయి. పదవీకాలం పూర్తికానున్న వారిలో భాజపా నుంచి 18 మంది, కాంగ్రెస్​ నుంచి 17 మంది సభ్యులుగా ఉన్నారు. కేంద్ర మంత్రులు హర్దీప్​ సింగ్​ పూరి, రామ్​దాస్​ అథవాలేలతో పాటు సీనియర్ నేతలు శరద్​ పవార్​, దిగ్విజయ్​ సింగ్​, విజయ్​ గోయల్ ఈ జాబితాలో​ ఉన్నారు.

రాజ్యసభలో మెజారిటీ దిశగా భాజపా పయనిస్తున్న నేపథ్యంలో 2018- 19 సంవత్సరాల్లో పలు శాసనసభ ఎన్నికల్లో ఓటమి కమలం పార్టీకి అవాంతరంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కారణంగా ఎలాంటి అదనపు ప్రయోజనం భాజపాకు వచ్చే అవకాశం కన్పించడం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో కాంగ్రెస్​ కూటమి పార్టీలు ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో మెరుగయ్యాయి. ఈ నేపథ్యంలో రానున్న రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ సహా మిత్రపక్ష పార్టీలకు లాభించే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం రాజ్యసభలోని 250 మంది సభ్యుల్లో భాజపా నుంచి 83 మంది, కాంగ్రెస్​ నుంచి 46 మంది​ సభ్యులు ఉన్నారు.

యూపీలో మెజారిటీ స్థానాలు భాజపావే..

ఉత్తర్​ప్రదేశ్​ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వారిలో 10మంది సభ్యుల పదవీకాలం ఈ ఏడాది తీరనుంది. రాష్ట్రంలో కమలం పార్టీకి మెజారిటీ ఉన్న నేపథ్యంలో ఎక్కువ శాతం భాజపా సొంతం చేసుకొనే అవకాశం ఉంది. రాజస్థాన్​, మధ్యప్రదేశ్​, ఝార్ఖండ్​, మహారాష్ట్రల్లో కాంగ్రెస్​కు మెజారిటీ ఉన్న కారణంగా ఆయా రాష్ట్రాల్లో హస్తం పార్టీకి లాభించే అవకాశం ఉంది.

ఏ రాష్ట్రాల్లో ఎన్ని స్థానాలు..

ఈ ఏడాది ఉత్తర్​ప్రదేశ్​లో 10, మహారాష్ట్ర నుంచి 7, తమిళనాడు 6, బంగాల్​, బిహార్​ రాష్టాల నుంచి 5 సీట్ల చొప్పున ఖాళీ అవనున్నాయి. ఆంధ్రప్రదేశ్​, గుజరాత్​, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల నుంచి 4 సభ్యుల చొప్పున పదవీ కాలం తీరనుంది. మధ్యప్రదేశ్​లో 3 స్థానాలకు, తెలంగాణ, హరియాణా, ఝార్ఖండ్​, ఛత్తీస్​గఢ్​ రాష్ట్రాల్లో రెండేసి స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

ఇదీ చూడండి: ఆస్ట్రేలియా ప్రధాని మోరిసన్​ భారత పర్యటన రద్దు

Last Updated : Jan 4, 2020, 9:41 AM IST

ABOUT THE AUTHOR

...view details