తెలంగాణ

telangana

మాలేగావ్​ పేలుళ్ల కేసు నిందితులకు బెయిల్

2006 మాలేగావ్ పేలుళ్ల  కేసులో నలుగురు నిందితులకు బెయిల్​ మంజూరు చేసింది బాంబే హై కోర్టు. రూ.50,000 పూచికత్తుతో బెయిల్ ఇచ్చింది. ప్రత్యేక న్యాయస్థానం విచారణ జరిపే సమయంలో హాజరు కావాలని ఆదేశించింది.

By

Published : Jun 14, 2019, 2:45 PM IST

Published : Jun 14, 2019, 2:45 PM IST

మాలేగావ్​ పేలుళ్ల కేసు నిందితులకు బెయిల్

మాలేగావ్​ వరుస బాంబు పేలుళ్ల కేసులో నలుగురు నిందితులకు బాంబే హై కోర్టు బెయిల్​ మంజూరు చేసింది. అయితే కొన్ని షరతులను విధించింది.

"పిటిషన్లను స్వీకరించాం. రూ.50,000 పూచీకత్తుతో బెయిల్​ మంజూరు చేస్తున్నాం. ప్రత్యేక న్యాయస్థానానికి విచారణ జరిగే రోజుల్లో హాజరుకావాలి. సాక్షులను కలవడానికి వీల్లేదు. ఆధారాలను తారుమారు చేయాలని ప్రయత్నించకూడదు."
- ధర్మాసనం

ఏం జరిగింది...?

2006 సెప్టెంబరు 8న మహారాష్ట్ర నాసిక్​లోని హమిదియా మసీదు వద్ద వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ దాడిలో 37 మంది ప్రాణాలు కోల్పోగా, 100 మందికి పైగా గాయాలపాలయ్యారు.

మహారాష్ట్ర తీవ్రవాద వ్యతిరేక దళం ముందుగా కేసును విచారించి 9 మంది నిందితులను అదుపులోకి తీసుకొంది. అనంతరం కేసును సీబీఐకు అప్పగించింది. తర్వాత జాతీయ దర్యాప్తు సంస్థ కేసును విచారించింది.

ABOUT THE AUTHOR

...view details