తెలంగాణ

telangana

ETV Bharat / bharat

షాజహాన్​ మియా హత్యకేసులో దోషులకు జీవిత ఖైదు

2013లో జరిగిన షాజహాన్ మియా హత్య కేసుపై త్రిపుర కోర్టు తీర్పు వెల్లడించింది. నలుగురు దోషులకు జీవిత ఖైదు విధించింది.

By

Published : Jan 23, 2021, 2:37 PM IST

tripura, mid day meal murder
షాజహాన్​ మియా హత్యకేసుపై తీర్పు వెల్లడించిన త్రిపుర కోర్టు

త్రిపురలో 2013లో జరిగిన షాజహాన్ మియా హత్య కేసుపై ఆ రాష్ట్ర అడిషనల్ సెషన్స్ కోర్టు తుది తీర్పు వెల్లడించింది. మొత్తం 13 మంది నిందితుల్లో నలుగురిని నేరస్థులుగా ప్రకటించి.. కోర్టు వారికి జీవిత ఖైదు, 25వేల జరిమానా విధించింది. దోషులలో ఓ మహిళ కూడా ఉంది. జరీనా బేగమ్​, రఫీక్​ మియా, మజీద్​ ఖాన్​, సాజల్​ మియాలను హంతకులుగా కోర్టు పేర్కొంది.

నాలుగు కేజీల బియ్యం ఇవ్వనందుకు..

పశ్చిమ త్రిపుర జిల్లాలోని జైపూర్ గ్రామానికి చెందిన షాజహాన్ మియా.. 4 కేజీల బియ్యం ఇవ్వని కారణంగా హత్య చేశారు. స్థానిక పాఠశాలతో మధ్యాహ్న భోజనానికి సరకుల పంపిణీపై దోషులతో మియాకు ఒప్పందం ఉంది. మొత్తం 7 కేజీల బియ్యం ఇవ్వాల్సిందా.. అప్పటికే మూడు కేజీలు అందించాడు మియా. అయితే మిగిలిన నాలుగు కేజీలు హెడ్​మాస్టర్​ను సంప్రదించి ఇస్తానన్నాడు. కానీ మరుసటి రోజు ఉదయమే హంతకులు మియాను దారుణహత్య చేశారు. ఈ ఘటన 2013 సెప్టెంబరు 27న జరిగింది.

ఇదీ చదవండి :'చైనా అలా చేస్తేనే భారత బలగాలు వెనక్కి'

ABOUT THE AUTHOR

...view details