తెలంగాణ

telangana

By

Published : Aug 6, 2020, 9:00 AM IST

ETV Bharat / bharat

75 ఏళ్ల బామ్మపై అత్యాచారం- నిందితుల్లో 66 ఏళ్ల మహిళ

కేరళలో 75 ఏళ్ల బామ్మపై అత్యంత పాశవికంగా లైంగికదాడి చేసిన కేసులో ముగ్గురిని అరెస్టు చేశారు పోలీసులు. ఇందులో 66 ఏళ్ల మహిళ కూడా ఉంది. ఈ ఘటనలో బాధితురాలు తీవ్రంగా గాయపడింది. ఆమె శరీరంపై, మర్మాంగాలపై గాయాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.

kerala rape case
75 ఏళ్ల బామ్మపై అత్యాచారం

కేరళ ఎర్నాకులంలో దారుణం జరిగింది. 75 ఏళ్ల బామ్మ మీద అత్యంత పాశవికంగాా లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. వీరిలో 66 సంవత్సరాల మహిళ కూడా ఉంది.

తీవ్రంగా గాయపడిన బాధితురాలికి వైద్యులు శస్త్రచికిత్స చేశారు. ఆమె పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని తెలిపారు. ఆమె ఛాతీ, పొట్ట, మర్మాంగాల వద్ద తీవ్ర గాయాలు ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. శరీర అంతర భాగాల్లో కూడా గాయాలు ఉన్నాయని పరీక్షల్లో తేలింది.

నిందితుల ఇంట్లోనే..

అరెస్టయిన మహిళ ఓమనకు చెందిన ఇంట్లోనే బామ్మపై లైంగికదాడి జరిగిందని పోలీసులు తెలిపారు. ఓమన, బాధితురాలు ఇద్దరు స్నేహితురాళ్లు. ఓమన ఇంటికి బాధితురాలు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. బాధితురాలికి మానసిక సమస్యలు, జ్ఞాపక శక్తి లోపం కూడా ఉందని తెలుస్తోంది.

"ఒకరు ఆమెపై అత్యాచారం జరుపుతుంటే, మద్యం తాగిన మరో వ్యక్తి ఆమెను దారుణంగా చిత్రహింసలకు గురిచేశారు. అనంతరం జారిపడి గాయాలయ్యాయని చుట్టుపక్కలవారిని నమ్మించింది ఓమన. రక్తస్రావం అవుతున్నా మొదట బాధితురాలిని ఆమె ఇంటికే చేర్చారు. ఆ తర్వాతే ఆసుపత్రికి తరలించారు."

- పోలీసులు

ఘటనపై కేరళ మహిళా కమిషన్​ సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది.

ఇదీ చూడండి:ఆసుపత్రిలో అగ్నిప్రమాదం- 8 మంది కొవిడ్​ రోగులు మృతి

ABOUT THE AUTHOR

...view details