తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఛత్తీస్​గఢ్​లో 27 మంది నక్సల్స్​ లొంగుబాటు

ఛత్తీస్​గఢ్​ దంతెవాడలో 27 మంది నక్సలైట్లు లొంగిపోయారు. అందులో ఆరుగురు మహిళలు ఉన్నారు. మావోయిస్టు భావజాలంతో విసుగు చెందే ఇలా చేసినట్లు పోలీసులు తెలిపారు.

By

Published : Nov 1, 2020, 7:40 PM IST

Naxals surrender in Dantewada
నక్సల్స్​ లొంగుబాటు

ఛత్తీస్​గఢ్​ దంతెవాడ జిల్లాలో 27 మంది నక్సలైట్లు పోలీసులకు లొంగిపోయారు. అందులో ఐదుగురిపై నగదు రివార్డు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. పోలీసులు చేపట్టిన పునరావాస కార్యక్రమానికి ఆకర్షితులవటం సహా.. మావోయిస్టు భావజాలంతో విసుగు చెంది లొంగిపోయారని పేర్కొన్నారు.

" కొత్తగా ఆరుగురు మహిళలు సహా మొత్తం 27 మంది నక్సలైట్లు బార్సూర్​ పోలీస్​ స్టేషన్​లో సీనియర్​ పోలీసులు, సీఆర్​పీఎఫ్​ ఆధికారుల ఎదుట లొంగిపోయారు. అందులో 11 మంది మావోయిస్టులు గుఫా, ఏడుగురు బెడ్మా, ఐదుగురు మంగ్​నార్​, ముగ్గురు హితవాడ, ఒకరు హండ్వాడా గ్రామాలకు చెందిన వారిగా గుర్తించాం. వారంతా పోలీసు బృందాలపై దాడులు, ఐఈడీలు పేల్చటం, మావోయిస్ట్​ పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేయటం వంటి నేరాల్లో పాలుపంచుకున్నారు. అందులో ఐదుగురిపై రూ.1 లక్ష రివార్డు కూడా ఉంది. తక్షణ సాయం కింద ప్రతిఒక్కరికి రూ. 10 వేల నగదు అందించాం. ప్రభుత్వ పునరావాస పాలసీ ప్రకారం అన్ని సౌకర్యాలు కల్పిస్తాం."

- అభిషేక్​ పల్లవ, దంతెవాడ ఎస్​పీ

నక్సలైట్ల పునరావాస కార్యక్రమం లోన్​ వర్రట్టు (మీ ఇంటికి తిరిగి రండి) ఈ ఏడాది జూన్​లో ప్రారంభించారు దంతెవాడ పోలీసులు. దీనికి మంచి స్పందన లభించింది. ఇప్పటి వరకు 177 మంది నక్సలైట్లు లొంగిపోయారు.

ఇదీ చూడండి: ఛత్తీస్​గఢ్​లో 32 మంది నక్సల్స్​ లొంగుబాటు

ABOUT THE AUTHOR

...view details