తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గోశాలలో 24 ఆవులు మృతి.. గ్రామస్థుల ఆందోళన

మధ్యప్రదేశ్​ దేవాస్​ జిల్లాలోని ఓ గోశాలలో 24 ఆవులు మృతి చెందటం కలకలం రేపింది. ఒక్కరోజే పదుల సంఖ్యలో ఆవులు ప్రాణాలు కోల్పోవటంపై ఆందోళనకు దిగారు గ్రామస్థులు. అధికారుల నిర్లక్ష్యంతోనే భారీ నష్టం వాటిల్లిందని ఆరోపించారు.

By

Published : Aug 21, 2020, 8:27 PM IST

cows die in Dewas gaushala
గోశాలలో 24 ఆవులు మృతి

మధ్యప్రదేశ్​ దేవాస్​ జిల్లాలోని శంకర్​గడ్​ గోశాలలో శుక్రవారం 24 ఆవులు మృతి చెందాయి. ఒక్కరోజే ఇన్ని ఆవులు ప్రాణాలు కోల్పోవటం కలకలం రేపింది. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్థులు.. గోశాల నిర్వహణ సరిగా లేదంటూ నిరసనలు చేశారు. అధికారుల నిర్లక్ష్యంతోనే ఆవులు మృతి చెందాయని ఆరోపించారు.

గోశాలలో 24 ఆవులు మృతి.. గ్రామస్థుల ఆందోళన

గోశాలలో ఆవులకు సరైన ఆహారం, నీరు ఇవ్వకపోవటం, అనారోగ్యానికి గురైన వాటికి చికిత్స అందించటంలో నిర్లక్ష్యంతోనే ఘోరం జరిగిందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు.

గోశాలలో మొత్తం బురద, మురికి నీరు నిండి ఉంది. దాంతోనే ఆవులు అనారోగ్యానికి గురై ఉంటాయి. జంతువుల మధ్య వ్యాధులు వ్యాప్తి చెందేందుకు అపరిశుభ్ర పరిస్థితులే కారణం అయి ఉండవచ్చు. వర్షపు నీరు చేరి గోశాల మొత్తం బురదమయంగా మారటమే ఆవుల మరణాలకు కారణం. ప్రతిరోజూ ఆవులు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నాయి. కానీ, ఏఒక్క అధికారి పట్టించుకోవటం లేదు. నేను ఇక్కడికి వచ్చి చూసినప్పటికే బురదలో చిక్కుకుని మరణించినట్లు తెలిసింది. ఆవుల షెడ్డు పరిశుభ్రంగా లేదు.

- మనోజ్​ రజనీ, కాంగ్రెస్​ నాయకుడు

వర్షాలతో గోశాల బురదమయంగా మారిందని.. పేడ, బురదలో చిక్కుకుని ఆవులు మరణించినట్లు అనుమానిస్తున్నామని జిల్లా పాలనాధికారి చంద్రమౌళి శుక్లా తెలిపారు. మరిన్ని మరణాలను నివారించేందుకు షెడ్డును శుభ్రం చేయాలని పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించామని చెప్పారు. చనిపోయిన ఆవులకు పోస్ట్​ మార్టం నిర్వహించి.. అసలు కారణం ఏమిటో తెలుసుకుని చర్యలు చేపడతామన్నారు.

ఇదీ చూడండి: రోడ్డుపై ఎలుగుబంటి హల్​చల్​- ఓ వ్యక్తిపై దాడి

ABOUT THE AUTHOR

...view details