బిహార్లో ఒక్కరోజులో పిడుగుపాటుకు గురై 83 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం ప్రకటన విడుదల చేసింది. వేర్వేరు ప్రాంతాల్లో పిడుగులు పడిన ఘటనల్లో వీరు మృతి చెందినట్లు పేర్కొంది. అసమ్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు, ఔరంగాబాద్లో ఇద్దరు, బక్సర్లో ముగ్గురు, నలందలో ఇద్దరు, జుమ్రుయిలో ఒక్కరు సహా 83మంది పిడుగుపాటుకు బలయినట్లు తెలిపింది.
పిడుగుపాటుకు ఒక్కరోజులో 83 మంది బలి
పిడుగుపాటుకు ఒక్కరోజులో 83 మంది బలి
14:57 June 25
పిడుగుపాటుకు ఒక్కరోజులో 83 మంది బలి
బిహార్లో మరో ఐదురోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే ప్రకటించింది వాతావరణ శాఖ.
రూ.4 లక్షల పరిహారం..
పిడుగుపాటుతో 83మంది మృతి చెందడంపై బిహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్ విచారం వ్యక్తం చేశారు. ఒక్కొక్కరికి నాలుగు లక్షల రూపాయల పరిహారం అందిస్తామని ప్రకటించారు.
Last Updated : Jun 25, 2020, 7:34 PM IST