తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కశ్మీర్​లో ఇద్దరు లష్కరే తోయిబా ముష్కరులు హతం

జమ్ముకశ్మీర్​ శోపియాన్​లో ఆదివారం ఉదయం జరిగిన ఎన్​కౌంటర్​లో ఇద్దరు లష్కరే తోయిబా సంస్థకు చెందిన తీవ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.

By

Published : May 12, 2019, 8:21 AM IST

Updated : May 12, 2019, 8:29 PM IST

కశ్మీర్​లో ఇద్దరు లష్కరే తోయిబా ముష్కరులు హతం

ఆదివారం ఉదయం జమ్ముకశ్మీర్​ శోపియాన్ జిల్లాలో భద్రతాబలగాలు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. వీరు లష్కరే తోయిబా సంస్థకు చెందిన జావిద్​ అహ్మద్​ బట్​, అదిల్​ బషీర్ వానిలుగా అధిాకారులు ధ్రువీకరించారు. హింద్ సీతాపూర్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న పక్కా సమాచారంతో నిర్బంధ తనిఖీలు చేశాయి బలగాలు.

గాలింపు చేపడుతుండగా భద్రతా సిబ్బందిపై ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. దీటుగా బదులిచ్చిన సైన్యం ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులను హతమార్చింది. ఘటనా స్థలం నుంచి పేలుడు సామగ్రి, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

Last Updated : May 12, 2019, 8:29 PM IST

ABOUT THE AUTHOR

...view details