తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'సీనియర్ న్యాయవాదుల సమక్షంలోనే ఆదేశాలిస్తాం'

పిటిషన్ల ఉపసంహరణకు అనుమతివ్వాలని ఇద్దరు కర్ణాటక స్వతంత్ర ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారించింది. ఈ కేసులో వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాదుల సమక్షంలోనే ఆదేశాలు జారీ చేస్తామని సుప్రీం స్పష్టం చేసింది.

By

Published : Jul 24, 2019, 12:48 PM IST

Updated : Jul 24, 2019, 1:53 PM IST

'సీనియర్ న్యాయవాదుల సమక్షంలోనే ఆదేశాలిస్తాం'

బలపరీక్ష నిర్వహించాలంటూ ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు సుప్రీంలో దాఖలు చేసిన పిటిషన్​ను... ఉపసంహరించుకుంటున్నట్లు వారి తరపు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్ ​గొగొయ్​ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఎదుట స్వతంత్ర ఎమ్మెల్యేలు ఆర్​ శంకర్​, హెచ్​ నగేష్ తరపున న్యాయవాదులు వాదించారు. కుమారస్వామి ప్రభుత్వానికి బలపరీక్ష నిర్వహించేలా కర్ణాటక స్పీకర్​ రమేష్ కుమార్​​ను ఆదేశించాలంటూ దాఖలు చేసిన తమ పిటిషన్లను ఉపసంహరించుకునేందుకు అనుమతివ్వాలని కోరారు.

వీరి వాదనలు విన్న ధర్మాసనం... ఎమ్మెల్యేల తరపు సీనియర్​ న్యాయవాది ముకుల్​ రోహిత్గీ ఎక్కడ? అభిషేక్​ సింఘ్వి ఎక్కడ అని ప్రశ్నించింది. వారిద్దరి సమక్షంలోనే తాము ఆదేశాలు జారీ చేస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.

కుప్పకూలిన కుమార సర్కార్​

మంగళవారం కర్ణాటక అసెంబ్లీలో నిర్వహించిన బలపరీక్షలో కుమారస్వామి నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిన సంగతి తెలిసిందే.

ఇదీ చూడండి: 'శౌచాలయంలో చిన్నారులకు వంట చేస్తే తప్పేంటి?'

Last Updated : Jul 24, 2019, 1:53 PM IST

ABOUT THE AUTHOR

...view details