తెలంగాణ

telangana

11వేల మందికిపైగా ప్రవాస భారతీయులకు కరోనా

By

Published : Sep 17, 2020, 10:28 PM IST

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్​ వ్యాప్తి ఎక్కువగానే ఉంది. మహమ్మారి దెబ్బకు ప్రవాస భారతీయులు 11వేల 600 మంది బాధితులుగా మారారు. వీరిలో అత్యధికంగా సింగపూర్​లోనే ఉన్నారు. ఈ దేశంలో సుమారు 4,618 మంది భారతీయులు కరోనా బారిన పడ్డారు.

11,616 Indians abroad infected with coronavirus: MEA
11,616 మందికిపైగా ప్రవాస భారతీయులకు కరోనా

దేశంలోనే కాకుండా విదేశాల్లోని భారతీయులనూ వదలడం లేదు కరోనా మహమ్మారి. ఇప్పటివరకూ మొత్తం 11,600 మంది ప్రవాస భారతీయులు కొవిడ్​ బారిన పడ్డారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రాజ్యసభకు తెలిపింది.

ఎగువసభలో లేవనెత్తిన ప్రశ్నకు ఈ మేరకు లిఖిత పూర్వక సమాధానమిచ్చారు విదేశాంగ మంత్రి మురళీధరన్​. అయితే విదేశాల్లో ఉన్న భారత పౌరుల సంక్షేమం కోసం.. అక్కడ ప్రత్యేక మిషన్​లు ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు.

2020 సెప్టెంబర్​ 10నాటికి భారత మిషన్ వివరాల ప్రకారం.. మొత్తం 11,616 ప్రవాసులకు వైరస్​ సోకింది. వీరిలో సింగపుర్​లో 4,618, బహ్రెయిన్​లో 2,639, కువైట్​​లో 1,769, ఒమన్​లో 907, ఖతార్​లో 420, ఇరాన్​లో 308, యూఏఈలో 238, ఇటలీలో 192 మంది ఉన్నారు.

ఇదీ చదవండి:'చైనా తీరు మార్చుకుంటేనే సరిహద్దులో శాంతి'

ABOUT THE AUTHOR

...view details