తెలంగాణ

telangana

By

Published : May 29, 2021, 8:25 PM IST

ETV Bharat / bharat

బులెట్​ కోసం వరుడి డిమాండ్​ ​- షాక్​ ఇచ్చిన వధువు!

కట్నం డిమాండ్ చేసిన ఓ వరుడికి షాకిచ్చింది వధువు. పెళ్లే వద్దని అతిథులందరి ముందే తెగేసి చెప్పింది. ఈ సంఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని బరేలీలో జరిగింది.

Bride refuses to marry on dowry demand
వరుడు కట్నం డిమాండ్​తో పెళ్లికి వధువు నిరాకరణ

వరకట్నం కారణంగా పీటల దాకా వచ్చి ఆగిపోయిన పెళ్లిల్లు ఎన్నో ఉన్నాయి. అలాంటి సంఘటనే ఉత్తర్​ప్రదేశ్​ బరేలీలో జరిగింది. అయితే.. ఇక్కడ కట్నం అడిగిన వరుడికి పెళ్లి కూతురే షాకిచ్చింది. కట్నం కోసం పట్టుబట్టిన అతనితో తనకు పెళ్లి వద్దని తెగేసి చెప్పింది.

తల్లిదండ్రులతో వధువు

ఇదీ జరిగింది..

పర్తాపుర్​ చౌధరీ గ్రామానికి చెందిన ఖలీల్​ ఖాన్​ కూతురు కుల్సుమ్​కు జీషన్​ ఖాన్​తో వివాహం నిశ్చయమైంది. ఫిబ్రవరిలో వారి నిశ్చితార్థం​ జరిగిన సమయంలో వరకట్నానికి సంబంధించి ఎలాంటి ప్రతిపాదన లేదు.

రెండు రోజుల క్రితం బరాత్​ పెట్టుకోగా, దానికోసం తాహతుగా తగ్గట్టుగా ఏర్పాట్లు చేశారు ఖలీల్. కట్నకానుకలు కూడా సిద్ధం చేశారు. అయితే ఆకస్మికంగా బైకు డిమాండ్​ చేశాడు వరుడు. లాక్​డౌన్​ అయినందున తక్షణం కొనుగోలు చేయడం వీలుపడదని చెప్పగా.. బుల్లెట్​ ధర రూ.2.30లక్షలు అయినా చెల్లించాలని పట్టుబట్టాడు.

బుల్లెట్​ కోసం ఏర్పాటు చేసిన నగదు

అప్పటికప్పుడు ఆ మొత్తాన్ని ఏర్పాటు చేయగలిగారు ఖలీల్​. కానీ, కాసేపటికే అనారోగ్యం బారినపడ్డారు. దీంతో అతిథులందరి ముందే ఆ పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పింది వధువు. తండ్రి సహా ఎవరు ఎంత చెప్పినా వినలేదు. చివరకు వారి వివాహం రద్దు అయ్యింది.

ఇదీ చూడండి:కొత్త రకం కట్నం కోరిన ఐఏఎస్ అధికారి!

ABOUT THE AUTHOR

...view details