తెలంగాణ

telangana

ETV Bharat / bharat

152 మంది పోలీసులకు హోంమంత్రి ఎక్స్​లెన్స్ మెడల్

కేంద్ర హోంమంత్రి మెడల్ ఫర్ ఎక్స్​లెన్స్ ఇన్ ఇన్వెస్టిగేషన్ అవార్డుకు దేశవ్యాప్తంగా 152 మంది పోలీసులు ఎంపికయ్యారు. అత్యధికంగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి 11 మంది ఎంపికైనట్లు కేంద్రం తెలిపింది. ఏపీ, తెలంగాణ నుంచి ఐదుగురు చొప్పున మెడల్ అందుకోనున్నట్లు వెల్లడించింది.

By

Published : Aug 12, 2021, 12:14 PM IST

HOME MINISTER MEDAL
కేంద్ర హోంశాఖ

కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా అందించే 'కేంద్ర హోంమంత్రి మెడల్ ఫర్ ఎక్స్​లెన్స్ ఇన్ ఇన్వెస్టిగేషన్' అవార్డుకు 152 మంది పోలీసు అధికారులు ఎంపికయ్యారు. ఇందులో 15 మంది సీబీఐ నుంచి ఉన్నారని కేంద్ర హోంశాఖ తెలిపింది.

ఇక రాష్ట్రాల వారిగా చూస్తే.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి ఐదుగురు చొప్పున ఈ మెడల్​కు ఎంపికయ్యారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర నుంచి అత్యధికంగా 11 మంది చొప్పున పోలీసులను ఈ అవార్డు వరించింది. ఉత్తర్​ప్రదేశ్ నుంచి 10, కేరళ, రాజస్థాన్​ల నుంచి 9 మంది చొప్పున,తమిళనాడు నుంచి ఎనిమిది మంది పోలీసులు మెడల్ అందుకోనున్నారు.

బిహార్ నుంచి ఏడుగురు, గుజరాత్, కర్ణాటక, దిల్లీ నుంచి ఆరుగురి చొప్పున ఈ మెడల్​కు ఎంపిక అయ్యారు. మొత్తం జాబితాలో 28 మహిళా పోలీసు అధికారులు సైతం చోటు దక్కించుకున్నారని కేంద్ర హోంశాఖ తెలిపింది.

సర్టిఫికేట్-అవార్డు

నేర విచారణలో మెరుగైన ప్రతిభ కనబర్చిన పోలీసు అధికారులకు ఈ అవార్డు అందిస్తారు. ఏటా 162 మందికి మించకుండా అధికారులను ఈ మెడల్​కు ఎంపిక చేస్తారు. కేంద్ర హోంమంత్రి సంతకం చేసిన సర్టిఫికేట్ సహా.. కాపర్-నికెల్ మిశ్రమాలతో తయారు చేసిన మెడల్​ను ఎంపికైన అధికారులకు ప్రదానం చేస్తారు.

ఇదీ చదవండి:'పార్లమెంట్ సమావేశాలు జరగలేదనే ప్రజలు అనుకుంటున్నారు'

ABOUT THE AUTHOR

...view details