తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్​ అధ్యక్షతన గురువారం బ్రిక్స్ సదస్సు

బ్రిక్స్​ దేశాల 13వ శిఖరాగ్ర సదస్సు(brics summit 2021) సెప్టెంబర్​ 9న జరగనుంది. భారత్​ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి బ్రిక్స్​ దేశాల నేతలు హాజరుకానున్నారు.

By

Published : Sep 6, 2021, 4:19 PM IST

13th BRICS summit
బ్రిక్స్ శిఖరాగ్ర​ సదస్సు

13వ బ్రిక్స్​ దేశాల (బ్రెజిల్​, రష్యా, భారత్​, చైనా, దక్షిణాఫ్రికా) శిఖరాగ్ర సదస్సు(brics summit 2021) భారత్​ నేతృత్వంలో ఈనెల 9న జరగనుందని అధికారవర్గాలు తెలిపాయి. ఆ దిశగా ఏర్పాట్లు జరుగుతున్నట్లు వెల్లడించారు. 2012, 2016 తర్వాత బ్రిక్స్​ శిఖరాగ్ర సదస్సుకు భారత్​ ఆతిథ్యమివ్వటం ఇది మూడోసారి.

2020లో వర్చువల్​గా..

కరోనా మహమ్మారి కారణంగా 2020 సదస్సును(brics summit 2020).. రష్యా నేతృత్వంలో వర్చువల్​గా నిర్వహించారు. తూర్పు లద్దాఖ్​ గల్వాన్​ లోయలో సైనిక ఘర్షణ తర్వాత తొలిసారి చైనా అధ్యక్షుడు షీ జిన్​పింగ్​, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒకే వేదికపై సమావేశమయ్యారు. అంతకు ముందు.. 11వ బ్రిక్స్​ వాణిజ్య మంత్రుల సమావేశం జరిగింది. బ్రిక్స్​ న్యూ డెవలప్​మెంట్​ బ్యాంక్​(ఎన్​డీబీ)లో(ndb brics bank) కొత్తగా చేరిన క్రమంలో బంగ్లాదేశ్​, యునైటెడ్​ అరబ్​ ఎమిరేట్స్​(యూఏఈ)ను ఈ సమావేశానికి ఆహ్వానించింది భారత్​. బ్రిక్స్​ డిజిటల్​ హెల్త్​ సమ్మిట్​లో కొవిడ్​-19 మహమ్మారితో ఎదురైన సవాళ్లు, అవకాశాలపై మాట్లాడింది భారత్​. అలాగే.. భారత్​ అధ్యక్షతన బ్రిక్స్​ దేశాల ఇంధన మంత్రుల సమావేశం నిర్వహించారు.

2006లో తొలిసారి..

2006, జులైలో రష్యా వేదికగా తొలిసారి సమావేశమయ్యారు బ్రిక్స్​ దేశాల నేతలు. ఆ తర్వాత సెప్టెంబర్​లో తొలి బ్రిక్స్​ దేశాల విదేశాంగ మంత్రుల స్థాయి సమావేశం జరిగింది. పూర్తిస్థాయి బ్రిక్స్​ సదస్సు 2009, జూన్​లో రష్యాలోని యెకటేరింబర్గ్​లో నిర్వహించారు.

ఇదీ చూడండి:దౌత్యంలో భారత్‌ వ్యూహాత్మక అడుగులు

ABOUT THE AUTHOR

...view details