- చంద్రబాబు క్వాష్ కేసులో ముగిసిన వాదనలు, తీర్పు వాయిదా
- ఉదయం నుంచి కోర్టులో సుదీర్ఘంగా సాగిన వాదనలు
- చంద్రబాబు క్వాష్ కేసులో సుదీర్ఘ వాదనలు వినిపించిన ఇరుపక్షాలు
- మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 5 వరకు సాగిన వాదనలు
- రంజిత్కుమార్
- అర్నాబ్ గోస్వామి కేసు తీర్పును నిహారిక కేసులో పరిగణలోకి తీసుకోలేదు..
- ఈ విషయం బెంచ్కు తెలియకుండా ఉంటుందని నేను అనుకోను..
- శుక్రవారంలోపు కౌంటర్ దాఖలు చేస్తామని కోర్టుకు తెలిపిన రంజిత్కుమార్
- హరీశ్సాల్వే
- ప్రభుత్వ తరఫు వాదనలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి.. ఒకసారి దర్యాప్తు ప్రారంభ దశలో ఉందంటారు..
- ఒకసారి దర్యాప్తు 2018లోనే ప్రారంభమైందంటారు
- నాలుగున్నరేళ్లు ప్రభుత్వంలో ఉండి ఇప్పుడు వచ్చి డాక్యుమెంట్లు కనబడట్లేదంటారు
- కేసుకు సంబంధించిన ఫైళ్లను ధ్వంసం చేసి పిటిషనర్పై నిందారోపణలు చేస్తున్నారు
- లూథ్రా
- ఏఏజీ వాదనలు.. ఒక వ్యక్తి స్వేచ్ఛ పట్ల ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయి
- నేను 2021లో నమోదైన ఫిర్యాదు గురించే మాట్లాడుతున్నాను
- ఆ ఫిర్యాదుపైనే వాదనలు వినిపిస్తున్నా.. 2021లో ఫిర్యాదు నమోదైంది..
- కేసులో అన్ని పరిణామాలు ఆ తర్వాతే జరిగాయి
- ఇప్పుడు 2018 ప్రస్తావన ఎందుకు?
- బెంచ్
- చెప్పాల్సింది ఉంటే ఇప్పుడే చెప్పాలని పిటిషనర్ తరఫు న్యాయవాదులకు సూచించిన కోర్టు
- రోజంతా విన్నాం.. ఈ కేసును తేల్చేస్తాం అని పిటిషనర్ తరఫు న్యాయవాదులకు చెప్పిన కోర్టు
- లూథ్రా
- ఏపీ ప్రభుత్వంలో పద్ధతి ప్రకారం పత్రాలు కనబడకుండా పోతున్నాయి
- ఈ కేసులో ఛైర్మన్ ఏ1 అయి ఉండి.. ఏ1 నిధులు విడుదల చేశారంటున్నారు
- అది ఏ37 సూచనల మేరకు చేశారన్నది మీ ఆరోపణ
- మీరు చెప్పిన వాదనల ప్రకారమే ఈ ఆరోపణలకు 17ఏ ఎందుకు వర్తించదు
- కేసు వాదన సందర్భంగా రఫేల్ కేసులో జస్టిస్ జోసెఫ్ అభిప్రాయాన్ని ప్రస్తావించిన లూథ్రా
- రఫేల్ కేసులోనూ కచ్చితంగా ఇలాగే జరిగింది
- కోర్టు
- ఇరువైపులా వాదనలు విన్నాం.. నిర్ణయం తీసుకుంటాం చెప్పిన కోర్టు
- ముకుల్ రోహత్గీ
- చంద్రబాబును 7న నిందితుడిగా పేర్కొన్నారు.. 9న అరెస్టు చేశారు:
- 12న క్వాష్ పిటిషన్ వేశారు.. ఇవాళ 19వ తేదీ.. కేవలం పది రోజులే
- కేసు దర్యాప్తు ఇప్పుడే ప్రారంభమైంది..ఈ కేసును ఇప్పుడే తీసుకోవద్దని మనవి
- దర్యాప్తు ప్రారంభమైంది ఇప్పుడే.. పిటిషనర్ తరఫున 900 పేజీల డాక్యుమెంట్ ఇచ్చారు
- ఇలాంటి పరిస్థితుల్లో ఈ కేసును విచారణకు తీసుకోవద్దు
- ఇంత లోతైన కేసును పది రోజుల్లో దర్యాప్తు చేయడం సాధ్యం కాదు
- ఇప్పటికే పిటిషనర్ బెయిల్ కూడా దరఖాస్తు చేశారు
- నిధుల దుర్వినియోగం జరిగిందని ప్రాథమిక విచారణలో తేలింది
- నిధుల దుర్వినియోగం కేసులో 17ఏ వర్తించదు
- పథకం ప్రకారం రూ.370 కోట్ల కుంభకోణం జరిగింది
- ప్రభుత్వ నిధులను దోచుకోవడాన్ని ప్రజా సేవ అనలేము
- సివిల్ సర్వీసు అధికారి సంతకం చేసినందున దీన్ని స్కామ్ అనకుండా ఉండలేము
- ఈ కేసులో పోలీసుల దర్యాప్తు జరుగుతోంది.. పన్నుల శాఖ, పీఎంఎల్ఏ దర్యాప్తు జరుగుతోంది
- ప్రాజెక్టు కట్టాం.. వరదకు కొట్టుకుపోయింది.. ప్రాజెక్టు నిర్మాణంలో మాకు దురుద్దేశం లేదన్నట్లుగా డిఫెన్సు వాదన ఉంది
- 17ఏ అన్నది అమాయకులైన ప్రజా సేవకులను కాపాడేందుకు తెచ్చింది
- 2018కి ముందే ఈ కేసులు సంబంధించి మూలాలు ఉన్నాయి.. కాబట్టి 2018 చట్టసవరణ వర్తించదు
- 2021లో అనుమతి తీసుకున్నాం.. 2018కి ముందు కేసు కావున అనుమతి తీసుకోవాలనే నిబంధన వర్తించదు
- ఇది కుట్రపూరితంగా.. పథకం ప్రకారంగా చేసింది .. అత్యున్నతస్థాయి ప్రభుత్వ అధికార కేంద్రం నుంచి ఈ కుట్రకు పథకం వేశారు
- వాదనల సందర్భంగా శంభునాథ్ మిశ్రా, నిహారిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేసులను ఉదహరించిన ముకుల్ రోహత్గీ
- పోలీసు దర్యాప్తు జరుగుతున్నప్పుడు కేసు మంచి చెడులకు కోర్టులు వెళ్లరాదు
- దర్యాప్తు పూర్తిచేసే అవకాశం పోలీసులకు కల్పించాలి
- ఇప్పటికి ఉన్న సాక్ష్యాల ఆధారంగా కేసు విషయంలో నిర్ణయానికి రాలేము
- అతి అరుదైన కేసుల్లో నేరపూరితమైన ఆరోపణలు లేనప్పుడే కోర్టులు కేసును కొట్టివేయగలవు
- దర్యాప్తు ఇప్పుడే ప్రారంభమైంది.. ఐటీ, ఈడీ దర్యాప్తు జరుపుతున్నాయి
- కేసు దర్యాప్తు తొలి దశలోనే కోర్టులు కేసును కొట్టివేయలేవు
- ఈ కేసుపై ఎంతసేపటికీ నేను మాజీ సీఎంను కాబట్టి ఇది రాజకీయం అని మాత్రమే వాదిస్తున్నారు
- ఎఫ్ఐఆర్ మాత్రమే సంపూర్ణమైన కేసు డాక్యుమెంట్ కాదు.. దర్యాప్తు క్రమంలో ఇతర నిందితులను చేర్చవచ్చు
- రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో పారదర్శకంగా పనిచేస్తోంది
- కేసు దర్యాప్తు ప్రారంభమైన 2021లోనే మాజీ సీఎం చేర్చలేదు
- తగినన్ని ఆధారాలు లభించిన తర్వాతే మాజీ సీఎం పేరు చేర్చారు
- అర్నాబ్ గోస్వామి కేసును ఈ కేసులో పరిగణలోకి తీసుకోలేము
- అర్నాబ్ గోస్వామి కేసు వాక్ స్వాతంత్ర్యానికి సంబంధించింది
- మాజీ సీఎం కేసు నిధుల దుర్వినియోగానికి సంబంధించింది
- ఇరువురి వృత్తులు పూర్తిగా భిన్నమైనవి.. కాబట్టి రెండింటినీ పోల్చలేము
- రెండు కంపెనీలు, ప్రభుత్వ సంస్థ మధ్య జరిగిన త్రైపాక్షిక ఒప్పందం
- ప్రైవేటు సంస్థ సిద్ధం కాకుండానే రూ.300 కోట్లు బదిలీ చేశారు
- రెండు ప్రైవేటు కంపెనీలు మరో 2 కంపెనీలను ఏర్పాటు చేసి ఆ రెండు కంపెనీలు 6 షెల్ కంపెనీలకు నిధులు బదిలీ చేశాయి
- ప్రభుత్వాలు ముందుగా సొమ్ము చెల్లించవు.. ఇది తొలి నుంచీ అనుమానాస్పదంగానే ఉంది
- ప్రభుత్వం ప్రతీకార ఇచ్ఛతో ఉంటే.. అధికారంలోకి వచ్చిన వెంటనే అరెస్టు చేసి ఉండేది
- ఎంవోయూ, సబ్ కాంట్రాక్టుల గురించి మాట్లాడట్లేదు.. ఈ ఒప్పందంలోని కంపెనీలన్నీ షెల్ కంపెనీలే
- ఎలాంటి సేవలు అందించకుండానే ఈ కంపెనీలు డబ్బులు తీసుకున్నాయి: ముకుల్ రోహత్గీ
- ప్రభుత్వ నిధుల దుర్వినియోగం జరిగిన క్రమం ఇది
- సబ్ కాంట్రాక్టులను ఎవరు నియమించారని ప్రశ్నించిన బెంచ్
- సబ్ కాంట్రాక్టర్ ఎంపికలో పిటిషనర్ పాత్ర ఏంటని ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించిన బెంచ్
-
- రంజిత్కుమార్
- పిటిషనర్కు ఐటీశాఖ నోటీసులు జారీ చేసింది.. ఇతర ప్రాజెక్టుల్లోనూ ఇదే తరహా లావాదేవీలు జరిగి ఉండవచ్చు: రంజిత్కుమార్
- అన్ని కేసుల్లోనూ నేరపూరిత ప్రక్రియ ఇలాగే ఉండవచ్చు: రంజిత్కుమార్
- లావాదేవీల ప్రక్రియపై ఫోరెన్సిక్ ఆడిట్ జరిగింది: రంజిత్కుమార్
- డిజైన్టెక్ రూ.200 కోట్లు మళ్లించినట్లు ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్టు వచ్చింది
- ఒప్పందం జరిగిన నెల రోజుల తర్వాత స్కిల్లార్ కంపెనీ ఏర్పాటైంది
- రూ.178 కోట్ల విలువైన వస్తువులను స్కిల్లార్ నుంచి డిజైన్టెక్ కొన్నట్లు చూపిస్తోంది
- ఈ ప్రతిపాదనలు, ఒప్పంద పత్రాలపై ఎక్కడా తేదీలు లేవు
- జీవోలు, ఒప్పందం ఏకరూపకంగా లేవు
- పిటిషనర్ తన 161 స్టేట్మెంట్లో కేవలం సంతకాల కోసం తన వద్దకు వచ్చినట్లు చెప్పారు
- ఒప్పందం మొత్తంలో జరగాల్సింది జరగలేదు
- కేసు డైరీ ప్రకారం ఇవి 2015-16లో జరిగిన లావాదేవీలు.. కాబట్టి 2018 సవరణ చట్టం వర్తించదు
- ఈ సందర్భంగా ప్రీతి షరాఫ్, స్టేట్ ఆఫ్ ఎన్సీటీ దిల్లీ కేసును ఉదహరించిన రంజిత్కుమార్
- హరీశ్ సాల్వే
- ఈ కేసులో ప్రాసిక్యూషన్ వాదన ఆశ్చర్యానికి గురిచేసేలా ఉంది
- ప్రాసిక్యూషన్ వాదన ప్రకారం మాజీ సీఎం ఆర్డర్ పాస్ చేసి సొంత మనుషులను ఛైర్మన్లుగా పెట్టుకున్నట్లు చెబుతున్నారు
- మాజీ సీఎం బేరసారాలు జరిపి నిర్ణయానికి వచ్చినట్లుగా చెబుతున్నారు.. ఈ వాదనే అసంబద్ధం, అర్థం లేనిది
- 2018తర్వాత నమోదైన అన్ని ఎఫ్ఐఆర్లకు 17ఏ వర్తిస్తుంది.. ప్రొసీజర్ విషయంలో ఎలాంటి సందేహాలకు తావులేదు
- ఎఫ్ఐఆర్ చదివితే ఒక్క ఆరోపణ కూడా కనిపించట్లేదు
- ఒక వ్యక్తిని అణచివేసేందుకు రాజ్యం తన శక్తిని వినియోగించకూడదు
- ప్రాసిక్యూషన్ వాదనలు అసంబద్ధంగా ఉన్నాయి.. ఒకటి అడుగుతుంటే మరోటి చెబుతున్నారు
- ప్రభుత్వ న్యాయవాది వాదన.. చీకట్లో వెతుకుతున్నట్లుగా ఉంది
- కేంద్ర ప్రభుత్వ సంస్థలు మదింపు చేసి నిర్ధారించాయి.. రాష్ట్రమేమో స్క్రూడ్రైవర్ల ధర ఎంతో కనుక్కునే ప్రయత్నం కనిపిస్తోంది
- ఆరు ప్రభుత్వ సంస్థలు కేసు వెనుకపడి అనవసర ప్రయాస పడుతున్నారు
- ఒప్పందంలో ప్రైవేటు సంస్థలు ఒక్క రూపాయి నగదు రూపంలో ఇవ్వాల్సిన అవసరం లేదు.. 90 శాతం వాళ్ల భాగం విజయవంతంగా పూర్తిచేశారు
- పన్నులను తగ్గించుకునేందుకు డిజైన్టెక్ ప్రయత్నం చేసినట్లు ఉంది.. అక్కడే అసలు సమస్య ప్రారంభమైనట్లు ఉంది
- పిటిషనర్ను ఈ కేసులో భాగస్వామ్యం చేయడం దురుద్దేశపూర్వక చర్య
- ఇది 2024 ఎన్నికల రాజకీయ రణక్షేత్రమే
- ఈ పరిణామాలన్నింటినీ పరిశీలిస్తే అదే స్పష్టమవుతోంది