తెలంగాణ

telangana

By

Published : Oct 15, 2021, 9:24 PM IST

ETV Bharat / bharat

మైసూరులో ముగిసిన దసరా ఉత్సవాలు..

కర్ణాటక మైసూరు ప్యాలెస్​లో దసరా ఉత్సవాలు (Mysore Palace Dasara) ముగిశాయి. చివరి రోజైన శుక్రవారం నిర్వహించిన జంబూ సవారీ.. భక్తులు, పర్యటకులను ఎంతోగానో ఆకట్టుకుంది.

Mysore Palace Dasara
జంబూ సవారీ

మైసూర్ ప్యాలెస్​లో ఘనంగా ముగిసిన దసరా ఉత్సవాలు

కర్ణాటక మైసూరు​ ప్యాలెస్​లో అంగరంగ వైభవంగా (Mysore Palace Dasara) జరిగిన దసరా ఉత్సవాలు.. అద్వితీయ జంబూ సవారీతో (Jamboo Savari Mysore) శుక్రవారం ముగిశాయి. కాగా.. రాయల్ ప్యాలెస్​ మాత్రం మరో 9 రోజుల పాటు కాంతులీననుంది. పర్యటకుల కోసం ప్యాలెస్​ను దీపకాంతులతో ముస్తాబుచేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై (Karnataka CM News) ఈ మేరకు ఆదేశించారు.

కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై

ఏటా వేలాది మంది ప్రజల మధ్య ఘనంగా జరిగే ఈ ఉత్సవాలు (Karnataka Dasara Celebration) కరోనా కారణంగా ఈసారి అనేక ఆంక్షల మధ్య నిర్వహించారు. అయితే కరోనా నిబంధనలను అనుసరించి శతాబ్దాలుగా వస్తున్న సంప్రదాయాలను కొనసాగించారు.

బొమ్మై పూజలు

ఆకట్టుకున్న జంబూ సవారీ..

ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా వడయార్ వంశానికి (Wadiyar Dynasty) చెందినవారే ఉత్సవాలు నిర్వహించారు. వడియార్‌ వంశ.. కులదైవమైన చాముండేశ్వరి దేవిని.. ఏనుగులపై ఊరేగింపుగా ప్యాలెస్‌కు తీసుకువచ్చారు.

జంబూ సవారీ

గజరాజు మీద స్వర్ణ అంబారీ ఉంచి.. అందులో చాముండి దేవి విగ్రహాన్ని ఊరేగించారు. స్వర్ణ అంబారీ (Jamboo Savari Mysore Dasara) కట్టిన ఏనుగుతోపాటు మొత్తం ఆరు గజరాజులు ఈ వేడుకల్లో పాల్గొన్నాయి.

గజరాజుల ఊరేగింపు

చాముండేశ్వరి దేవిని తీసుకొస్తున్న సమయంలో ప్యాలెస్‌లోని వీధులలో కోలాహలంగా చేసిన కళా ప్రదర్శనలు.. ఆకట్టుకున్నాయి.

అమ్మవారికి మొక్కుతున్న సీఎం

కర్ణాటక సీఎం (Karnataka CM) బసవరాజు బొమ్మై స్వయంగా ఈ వేడుకల్లో పాల్గొని.. ఉత్సవాలను ప్రత్యక్షంగా వీక్షించారు.

అంబారీలో చాముండి దేవి

దసరా సందర్భంగా మైసూర్‌లో నిర్వహించే.. ఈ ఉత్సవాలను తిలకించేందుకు యావత్‌ కర్ణాటక (Karnataka Dasara) నుంచే కాకుండా దేశ నలుమూలల నుంచి ప్రజలు తరలివచ్చారు.

ఇదీ చూడండి:Dasara Festival 2021: దేశవ్యాప్తంగా ఘనంగా దసరా వేడుకలు

ABOUT THE AUTHOR

...view details