YCP vs JANASENA FLEXI CONTROVERCY: తారాస్థాయికి చేరిన వైసీపీ, జనసేన ఫ్లెక్సీ వార్
YCP vs JANASENA FLEXI CONTROVERCY: వైసీపీ, జనసేన మధ్య బ్యానర్ల వివాదం రోజు రోజుకూ ముదిరిపోతోంది. ఒంగోలు జిల్లాలో మొదలైన ఈ బ్యానర్ల వివాదం పలు ప్రాంతాలకు పాకుతోంది. తాజాగా.. కృష్ణాజిల్లాలోని మచిలీపట్నంలో వైసీపీ, జనసేన మధ్య బ్యానర్ల వివాదం నెలకొంది. వైసీపీ నేతలు చంద్రబాబు, లోకేశ్ల పల్లకీని పవన్ కల్యాణ్, ఇతరులు మోస్తున్నట్లుగా ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. తమ నాయకుడిని కించపరుస్తూ.. ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తారా..? అని మండిపడిన జనసైనికులు.. వైసీపీ ఫ్లెక్సీలకు పోటీగా జనసేన కార్యకర్తలు సీఎం జగన్ను పల్లకిలో మోస్తున్న అధికారులు, రాజకీయ నాయకుల చిత్రాలతో భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
ఇలా వైసీపీ నేతలు ఎక్కడెక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారో అదే ప్రాంతంలో జనసైనికులు కూడా తమ ఫ్లెక్సీలు అతికించారు. అయితే కోనేరు సెంటర్, బస్టాండ్ సెంటర్లో జనసేన ఏర్పాటు చేసిన బ్యానర్లను మున్సిపల్ అధికారులు తొలగించారు. అదే ప్రాంతంలో ఉన్న వైసీపీ బ్యానర్లును మాత్రం అధికారులు ముట్టుకోలేదు. దీంతో జనసేన నాయకులు మున్సిపల్ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నాయకులకు, మున్సిపల్ అధికారులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇలా పలు ప్రాంతాల్లో వైసీపీ, జనసేన మధ్య ఫ్లెక్సీల వివాదాలు వెలుగుచూస్తున్నాయి. వైసీపీ, జనసేన బ్యానర్ల వివాదాలపై మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.