ఆంధ్రప్రదేశ్

andhra pradesh

tdp_visited_sc_corporation_sanctioned_vehicles

ETV Bharat / videos

"టీడీపీ మంజూరు చేసిందని - కోట్ల విలువైన యంత్రాలను నాశనం చేశారు"

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 23, 2023, 3:52 PM IST

TDP Visited SC Corporation Sanctioned Vehicles: ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మంజూరైన వాహనాలను ఎస్సీలకు పంపిణీ చేయకుండా వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని.. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డి విమర్శించారు. కడప మహిళా సాధికార సెంటర్‌ ప్రాంగణంలో నిరుపయోగంగా పడి ఉన్న వాహనాలను నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ మాధవీ రెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. ఎస్సీలకు లబ్ధిదారులకు మంజూరైన ఎలక్ట్రిక్‌ ఆటోలు, మురుగు శుభ్రం చేసే డ్రైక్లీనర్లు, ట్రాక్టర్లు, జేసీబీలను నేతలు పరిశీలించారు. యంత్రాలు నాలుగున్నరేళ్ల నుంచి నిరుపయోగంగా పడి ఉన్నా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవటం లేదని శ్రీనివాసుల రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.  

గత ప్రభుత్వం ఎస్సీలకు ఎలక్ట్రికల్ ఆటోలు, ట్రాక్టర్లు, జేసీబీలు, ఇతర యంత్ర సామాగ్రిని కార్పోరేషన్​ ద్వారా మంజూరు చేసిందని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఆ యంత్రాలు చాలా వరకు తుప్పుపట్టాయని.. టీడీపీ ప్రభుత్వం మంజూరు చేసిందనే ఉద్దేశంతోనే వైసీపీ వాటిని నిరూపయోగంగా పడేశారని శ్రీనివాసులు రెడ్డి ఆరోపించారు. సామాజిక బస్సు యాత్ర పేరుతో కడపలో యాత్ర చేస్తున్న నాయకులు.. ఇదే నగరంలో వాహనాలను పంపిణీ చేయకపోవడం దేనికి సంకేతామని ప్రశ్నించారు. 

ABOUT THE AUTHOR

...view details