ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Mannava Mohana Krishna

ETV Bharat / videos

వైసీపీ పాలనలో పేదలు సంక్రాంతికి దూరమయ్యారు: మన్నవ మోహన కృష్ణ

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 14, 2024, 6:19 AM IST

Mannava Mohana Krishna Distributed Chandranna Kanuka to People:వైసీపీ హయాంలో పేదలు సంక్రాంతి పండగను కూడా సంతోషంగా జరపుకోలేని దుస్థితి నెలకొందని టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి మన్నవ మోహన కృష్ణ అన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పేదలకు ఆయన నిత్యావసర సరుకులు పంపిణి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చందన్న కానుకను వైసీపీ ప్రభుత్వం ఆపివేసినందున పేదలు ఇబ్బందిపడకుండా పండుగ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. 

టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఎలాగైతే పేదలకు చంద్రన్న కానుక అందజేశారో ఆయన స్పూర్తితో గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి పండగకు మన్నవ మోహనకృష్ణ చారిటబుల్​ ట్రస్​ ద్వారా చంద్రన్న పేరుతో ఇస్తున్నామని అన్నారు. కాని వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ పథకాలను తీసేశారు. అయినా సరె మా సొంత ఖర్చుతో పేదలకు నిత్యావసర సరుకులు ఇస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాల వల్ల చంద్రబాబు పేరు ప్రజలలోకి వెళ్తుందని జగన్ పోలీసుల ద్వారా అడ్డుకుంలు సృష్టిస్తున్నారని అన్నారు. మన్నవ మోహనకృష్ణ ప్రతి ఇంటికీ వెళ్లి చంద్రన్న కానుక అందిస్తుండటంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

ABOUT THE AUTHOR

...view details