ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Kodikatti case Arguments in High Court

కోడికత్తి కేసు - తుది వాదనలకు ఇరువర్గాలు సిద్ధంగా ఉండండి: హైకోర్టు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 19, 2023, 9:37 PM IST

Published : Dec 19, 2023, 9:37 PM IST

Updated : Dec 19, 2023, 9:54 PM IST

 Kodikatti case Arguments in High Court: కోడికత్తి కేసులో లోతైన దర్యాప్తు చేయాలని కోరుతూ సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్​పై హైకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. విశాఖ ఎన్​ఐఏ కోర్టులో జరుగుతున్న జగన్​పై దాడి కేసు విచారణపై గతంలో ఉన్న స్టేను మరో మూడు వారాల పాటు కొనసాగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తుది వాదనలు వినిపించేందుకు సిద్ధంగా ఉండాలని ఇరువైపులా న్యాయవాదులకు న్యాయస్థానం సూచించింది.  

ఎన్నో అనుమానాలు: ప్రస్తుత సీఎం, నాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్​పై హత్యాయత్నం చేశాడని జనుపల్లి శ్రీనుపై కేసు కట్టి, జైల్లో పెట్టి అయిదేళ్లు కావస్తుంది. ఈ అయిదేళ్లుగా నిందితుడు శ్రీనివాస్‌కు బెయిల్‌ రాలేదు. కోర్టుకు రాకుండా సీఎం జగన్ ఈ కేసును సాగదీస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.  తనపై హత్యాయత్నం జరిగిందని ఆనాడు జగన్ ఎంతో హడావుడి చేశారు. అప్పట్లో తాను ఏపీ పోలీసులను కానీ, ఏపీ డాక్టర్లను కానీ నమ్మను అని ప్రకటించాడు. కేంద్ర సంస్థల దర్యాప్తు కావాలని జగన్ డిమాండ్ చేశారు. ఇప్పుడు అదే జాతీయ దర్యాప్తు సంస్థ ఈ కేసులో ఎలాంటి కుట్రలేదని వెల్లడించింది. జగన్‌ సీఎం అయ్యారు. అధికారం చేతిలో ఉంది. కానీ కోడికత్తి కేసు ఒక కొలిక్కి రావపోవడంతో అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

Last Updated : Dec 19, 2023, 9:54 PM IST

ABOUT THE AUTHOR

...view details