చిత్తూరులో శివరాత్రి వేడుకలు
చిత్తూరు జిల్లాలో మహా శివరాత్రి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వేకువజాము నుంచే పరమశివుని నామస్మరణతో శైవక్షేత్రాలు మార్మోగుతున్నాయి. శ్రీకాళహస్తీ, పుత్తూరు, ఎర్రావారి పాళ్యం, గుర్రంకొండ, కలికిరి, తిరుపతి తదితర ప్రాంతాల్లోని ఆలయాల్లో శివయ్య దర్శనార్థం భక్తులు బారులు తీరారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.