ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బ్రహ్మంసాగర్‌ జలాశయం నుంచి కుడి, ఎడమ కాల్వలకు నీరు విడుదల

బ్రహ్మంసాగర్‌ జలాశయం నుంచి కుడి, ఎడమ కాల్వలకు 20 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కార్యక్రమానికి ఎంపీ అవినాష్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. బ్రహ్మంగారిమఠం మండలంతోపాటు బద్వేలులోని చెరువులకు నీరు నింపడం ద్వారా సాగుకు భరోసా కల్పిస్తున్నామని ఎంపీ తెలిపారు.

By

Published : Aug 28, 2020, 1:44 PM IST

water is released from brahmamsagar project to right and left canals in kadapa district
బ్రహ్మంసాగర్‌ జలాశయం నుంచి కుడి, ఎడమ కాల్వలకు నీరు విడుదల

కడప జిల్లాలోని బ్రహ్మంగారి మఠంలోని బ్రహ్మంసాగర్‌ జలాశయం నుంచి కాల్వలకు ఎంపీ అవినాష్ రెడ్డి నీరు విడుదల చేశారు. జలాశయం నుంచి కుడి, ఎడమ కాల్వలకు 20 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. బ్రహ్మంగారిమఠం మండలంతోపాటు బద్వేలులోని చెరువులకు నీరు నింపడం ద్వారా సాగుకు భరోసా కల్పిస్తున్నామని ఎంపీ తెలిపారు. ప్రస్తుతం బ్రహ్మంసాగర్‌ జలాశయంలో 5.5 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. ఎమ్మెల్యేలు రఘురామిరామిరెడ్డి, వెంకటసుబ్బయ్య, ఎమ్మెల్సీ గోవిందరెడ్డిలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details