కడప జిల్లా బద్వేలులో జనతా కర్ఫ్యూ కొనసాగుతోంది. ఎప్పుడు జనంతో రద్దీగా ఉండే వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. అత్యవసర వేళల్లోనే జనం రోడ్లపైకి వస్తున్నారు. బస్సులు ఆర్టీసీ డిపోకే పరిమితమయ్యాయి. దుకాణాలు మూతపడ్డాయి. ఏటీఎంలు జనం లేకుండా దర్శనమిస్తున్నాయి. మెడికల్ షాపులు, ఆసుపత్రులు మాత్రమే పనిచేస్తున్నాయి.
బద్వేలులో జనతా కర్ఫ్యూ
కడప జిల్లా బద్వేలులో జనతా కర్ప్యూలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. ప్రజల ఇళ్లకే పరిమితం అయ్యారు. మెడికల్ షాపులు, ఆసుపత్రులు తప్ప అన్నీ నిర్మానుష్యంగా మారాయి.
The Janata curfew continues at badvelu at Kadapa district.