దిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనలకు మద్దతుగా విశాఖలో ఈనెల 24న లాంగ్ మార్చ్ నిర్వహించనున్నట్లు విద్యార్థి సంఘాలు ప్రకటించాయి. ఇందుకు సంబంధించిన గోడ పత్రికను ఇవాళ జీవీఎంసీ గాంధీ పార్కులో ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు విడుదల చేసారు. మైనస్ డిగ్రీల చలిని తట్టుకొని రైతులు తమ న్యాయమైన సమస్యల కోసం పోరాటాలు చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తోందని విద్యార్థి సంఘం నాయకులు మండిపడ్డారు. కేంద్రం తీరును ఎండగడుతూ రైతులకు మద్దతుగా మద్దిలపాలెం నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు లాంగ్ మార్చ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేసారు.
మైదుకూరులో మహిళల ఆందోళన...