ఆర్టీసీ ఎండీ ఆర్పీ ఠాకూర్ కడపలో పర్యటించారు. ఆర్ఎం ప్రధాన కార్యాలయం వెనక నూతనంగా నిర్మిస్తున్న ఆస్పత్రి భవనాలను ఆయన పరిశీలించారు. రాయలసీమ ప్రాంతానికి చెందిన ఆర్టీసీ సిబ్బంది కోసం సూపర్ స్పెషాలిటీ తరహాలో ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. ఈ నెలలో సీఎం జగన్ ఆస్పత్రిని ప్రారంభించనున్నారనే ముందస్తు సమాచారంతో పనులు పరిశీలించారు.
ఆస్పత్రిలో పరికరాలు, వసతుల కల్పన, పనులు ఎంతవరకు జరిగాయని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. మిగిలి ఉన్న పనులు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అంతకంటే ముందు పులివెందులలో పర్యటించి.. అక్కడ కొత్తగా నిర్మిస్తున్న ఆర్టీసీ బస్టాండు, స్థల సేకరణ వంటి వాటిని ఎండీ పరిశీలించారు.