కడప జిల్లా రాయచోటిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాాశాల సమీపంలో రోడ్డు దాటుతున్న ద్విచక్ర వాహనాన్ని వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాయచోటికి చెందిన విజయనాయుడు, అజ్మతుల్లా తీవ్రంగా గాయపడ్డారు. వీరిని రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
TAGGED:
కడప జిల్లాలో రోడ్డు ప్రమాదం