ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఈటీవీ భారత్​ కథనానికి స్పందన.. డంపింగ్​ యార్డు సమస్య పరిష్కారం

By

Published : Mar 5, 2020, 8:31 PM IST

కడప జిల్లా రాజంపేట పురపాలక డంపింగ్ యార్డు​పై ఈటీవీ భారత్ రాసిన కథనానికి అధికారులు స్పందించారు. పురపాలక డంపింగ్​ యార్డు వద్ద ఉన్న చెత్తను తొలగించేలా చర్యలు చేపట్టారు.

Response to ETV bharat article on the dumping yard at rajampeta
రాజంపేట పురపాలక డంపింగ్ యార్డ్

ఈటీవీ భారత్​ కథనంతో డంపింగ్​ యార్డు సమస్య పరిష్కరించిన అధికారులు

కడప జిల్లా రాజంపేట పురపాలక డంపింగ్ యార్డు వద్ద ఎటు చూసినా చెత్త కుప్పలు దర్శనమిచ్చేవి. డంపింగ్ యార్డు ప్రధాన ద్వారం చెత్తతో పూర్తిగా మూసుకుపోయి ఉండేది. చెత్త నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల స్థానికులు దోమలు, దుర్వాసనతో ఇబ్బందులు పడేవారు. ప్రజల సమస్యలను వివరిస్తూ గత నెల 8న ఈటీవీ భారత్​ కథనాన్ని ప్రచురించింది. దీనిపై స్పందించిన అధికారులు ప్రధాన ద్వారానికి అడ్డుగా ఉన్న చెత్తను తొలగించేలా చర్యలు చేపట్టారు. దీని వల్ల డంపింగ్​ యార్డుకు కొత్తరూపు వచ్చింది.

ABOUT THE AUTHOR

...view details