ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అతిగా మద్యం తాగి.. వ్యక్తి మృతి

అనుమానంతో భార్యతో గొడవపడడంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురైన అతను అధికంగా మద్యం తాగడంతో మృతి చెందాడు ఈ విషాదకర ఘటన కడప జిల్లా రాయచోటిలో జరిగింది.

By

Published : Aug 31, 2020, 10:16 AM IST

one died due to having heavy wine
వ్యక్తి మృతి

కడప జిల్లా రాయచోటి ఏజీ గార్డెన్​కి చెందిన ఓ వ్యక్తి భార్యతో గొడవపడటంతో.. ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపంతో సమీపంలో ఉన్న గుట్టల్లోకి వెళ్లి అధికంగా మద్యం తాగి మృతి చెందాడు.

ఏజీ గార్డెన్​కు చెందిన అబ్బవరం రాంబాబు ఐదు రోజుల క్రితం గ్రామ సమీపంలో ఉన్న గట్టుల్లోకి వెళ్లిపోయి అతిగా మద్యం తాగాడు. దీంతో మంచినీరు, ఆహారం లేక మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహం కుల్లిపోవటంతో సంఘటన స్థలంలోనే శవపరీక్ష నిర్వహించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ రాజు తెలిపారు.

ఇదీ చదవండి:విషాదం.. కరెంటు షాక్​తో యువకుడు మృతి

ABOUT THE AUTHOR

...view details