కడప జిల్లా రాజంపేట నియోజకవర్గ పరిధిలోని ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో పౌర్ణమిని పురస్కరించుకొని... తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో సీతారాముల కల్యాణాన్ని ఆలయ పండితులు కమనీయంగా నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చేవారు. లాక్డౌన్ కారణంగా భక్తులను ఆలయంలోకి అనుమతించలేదు. కేవలం వేద పండితులు, తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల సమక్షంలో... ఎలాంటి ఆర్భాటాలు లేకుండా స్వామివారి కల్యాణాన్ని నిర్వహించారు.
నిరాడంబరంగా ఒంటిమిట్ట కోదండరామస్వామి కల్యాణోత్సవం
కడప జిల్లా రాజంపేటలోని ఒంటిమిట్ట కోదండరామస్వామి వారి కల్యాణ మహోత్సవం నిరాడంబరంగా జరిగింది. కరోనా లాక్డౌన్ కారణంగా స్వామివారి వేడుకలను.. ఎటువంటి హంగులు, ఆర్భాటాలు లేకుండా నిర్వహించారు. వేద పండితులు మంత్రోశ్ఛరణల నడుమ శాస్త్రోక్తంగా చేపట్టారు. లాక్డౌన్ అమల్లో ఉన్నందున భక్తులను ఆలయంలోకి అనుమతించలేదు.
Bhadravati Bhavanarayanaswamy Brahmotsavas at Boyinapalli in kadapa