ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నిరాడంబరంగా ఒంటిమిట్ట కోదండరామస్వామి కల్యాణోత్సవం

కడప జిల్లా రాజంపేటలోని ఒంటిమిట్ట కోదండరామస్వామి వారి కల్యాణ మహోత్సవం నిరాడంబరంగా జరిగింది. కరోనా లాక్​డౌన్ కారణంగా స్వామివారి వేడుకలను.. ఎటువంటి హంగులు, ఆర్భాటాలు లేకుండా నిర్వహించారు. వేద పండితులు మంత్రోశ్ఛరణల నడుమ శాస్త్రోక్తంగా చేపట్టారు. లాక్​డౌన్ అమల్లో ఉన్నందున భక్తులను ఆలయంలోకి అనుమతించలేదు.

By

Published : May 7, 2020, 6:35 PM IST

Updated : May 8, 2020, 12:05 AM IST

Bhadravati Bhavanarayanaswamy Brahmotsavas at Boyinapalli in kadapa
Bhadravati Bhavanarayanaswamy Brahmotsavas at Boyinapalli in kadapa

కడప జిల్లా రాజంపేట నియోజకవర్గ పరిధిలోని ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో పౌర్ణమిని పురస్కరించుకొని... తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో సీతారాముల కల్యాణాన్ని ఆలయ పండితులు కమనీయంగా నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చేవారు. లాక్​డౌన్ కారణంగా భక్తులను ఆలయంలోకి అనుమతించలేదు. కేవలం వేద పండితులు, తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల సమక్షంలో... ఎలాంటి ఆర్భాటాలు లేకుండా స్వామివారి కల్యాణాన్ని నిర్వహించారు.

Last Updated : May 8, 2020, 12:05 AM IST

ABOUT THE AUTHOR

...view details