ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పనులు జరగడం లేదని కలెక్టరేట్​ ఎదుట బాధితుడు నిరసన

ప్రభుత్వ కార్యాలయాల్లో ఎలాంటి పనులు జరగడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలకు పనులు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. దీనికి నిరసనగా బాధితుడు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగాడు.

By

Published : Oct 31, 2020, 7:04 PM IST

man protest
man protest

కడప జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఎలాంటి పనులు జరగడం లేదని బాధితుడు నాగ చంద్రహాస్ రెడ్డి ఆరోపించారు. కడపకు చెందిన భూగర్భ గనుల శాఖ అధికారుల తీరును నిరసిస్తూ.. నాగ చంద్రహాస్ రెడ్డి కడప కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. లక్కిరెడ్డిపల్లి వద్ద ఉన్న గనులకు అనుమతి ఇవ్వాలని భూగర్భగనుల శాఖకు అనుమతి కోరగా.. ఇప్పటివరకు అధికారులు పట్టించుకోలేదన్నారు. లక్కిరెడ్డిపల్లె ఎమ్మార్వో దగ్గరకు వెళితే.. తనకు తెలియదని తాను రెవెన్యూ శాఖకు కొత్త అని.. ఉన్నతాధికారుల వద్దకు వెళ్లాలని సూచించారని చెప్పారు. ఆయన చెప్పిన శాఖకు వెళ్లినా.. అధికారులు పట్టించుకోలేదని తెలిపారు. పైగా రాజకీయపరంగా వెళితే పనులు జరుగుతాయని ఉచిత సలహాలు ఇస్తున్నారని పేర్కొన్నారు. తాను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదని..అయినా అధికారులు ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details