రాజంపేటలో త్రీడీ సాంకేతిక పరిజ్ఞానంతో ఫేస్షీల్డ్
కరోనా నుంచి రక్షణపొందేందుకు ప్రజలు అనేక రకాల పద్ధతులను అవలంబిస్తున్నారు. మూతికి మాస్కులు, కర్చీఫ్లు కట్టుకోవడం వంటివి చేస్తున్నారు. అయితే కంటి ద్వారా కూడా కరోనా వ్యాప్తి చెందుతుందని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు కడపజిల్లా రాజంపేట అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాల మెకానికల్ విభాగంలో సహాయ ప్రొఫెసర్గా పనిచేస్తున్న వెంకటేష్ త్రీడీ సాంకేతిక పరిజ్ఞానంతో ఫేస్షీల్డ్ను తయారుచేశాడు.
రాజంపేటలో త్రీడీ సాంకేతిక పరిజ్ఞానంతో ఫేస్షీల్డ్