ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దాడులు పెరిగాయ్.. ఉద్యోగాలు పోతున్నాయ్!

వైకాపా నాయకుల దాడులు పెరిగిపోతున్నాయని మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి ఆరోపించారు. కక్షపూరితంగా కొంతమంది ఉద్యోగాలు తొలగిస్తున్నారన్నారు.

By

Published : Jun 13, 2019, 6:49 PM IST

పోలీసులకు మాజీ మంత్రి ఫిర్యాదు

మీడియాతో మాజీ మంత్రి

ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయినప్పటి నుంచి వైకాపా నాయకుల దౌర్జన్యాలు ఎక్కువ అయ్యాయని మాజీ మంత్రి పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి ఆరోపించారు. వైకాపా నాయకులు గ్రామాల్లో చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని.. అదే జరిగితే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కడప జిల్లా మైలవరం మండలంలోని సోలార్ పరిశ్రమలో 14 మంది కార్మికులను అన్యాయంగా తొలగించారని... ఇంత ఎంత వరకు సబబని ప్రశ్నించారు. ఈ విషయంపై జమ్మలమడుగు గ్రామీణ పోలీసు స్టేషన్​లో రామసుబ్బా రెడ్డి ఫిర్యాదు చేశారు. కొన్నేళ్లుగా ఉద్యోగాలను నమ్ముకొని జీవనం సాగిస్తున్న వారిని తొలగిస్తే ఊరుకునేది లేదన్నారు. పోలీసులు దృష్టి సారించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details