కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక ప్రజావ్యతిరేక విధానాలను మానుకోవాలని.. సీఐటీయూ ఆలిండియా కమిటీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో...ఆదివారం కడప జిల్లా రాయచోటి పట్టణంలోని పాత పురపాలక కార్యాలయం ఆవరణంలోని సచివాలయాల వద్ద యూనియన్ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు.
కేంద్రంలోని భాజపా ప్రభుత్వం.. కొవిడ్ అని చూడకుండా... కార్మిక హక్కులు, చట్టాలను కాలరాస్తోందని సీఐటీయూ నాయకులు విమర్శించారు. కార్మికుల పట్ల కేంద్రం చూపిస్తున్న వివక్షను ఖండించాలని పిలుపునిచ్చారు. పని భారం పెంచి జీతాలు సకాలంలో ఇవ్వకుండా మోపుతున్న నిర్బంధాన్ని ఐక్య ఉద్యమాలతో ప్రతిఘటిస్తామన్నారు.