ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెరుచుకున్న చర్చి తలుపులు...మెుదలైన ప్రార్థనలు !

సుమారు 70 రోజుల తర్వాత చర్చి తలుపులు తెరుచుకున్నాయి. కడపలో ఉదయం నుంచి క్రైస్తవులు ప్రార్థనల కోసం చర్చీలకు వెళుతున్నారు. ప్రార్థన మందిరాల వద్ద నిర్వహకులు శానిటైజర్లు ఏర్పాటు చేశారు.

By

Published : Jun 8, 2020, 10:11 AM IST

తెరుచుకున్న చర్చి తలుపులు
తెరుచుకున్న చర్చి తలుపులు

కడప జిల్లాలోని చర్చీలన్నీ తెరుచుకున్నాయి. లాక్​డౌన్ కారణంగా 70కి పైగా రోజులు ప్రార్థన మందిరాలు మూసివేసిన సంగతి తెలిసిందే. తిరిగి ఈరోజు ప్రార్థనా మందిరాలను ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు తెరిచారు. ఉదయం నుంచి ప్రార్థనలు మొదలయ్యాయి. ప్రార్థన మందిరాల వద్ద నిర్వహకులు శానిటైజర్లు ఏర్పాటు చేశారు. భక్తులు ఒక్కొక్కరుగా వెళ్లి ప్రార్థనలు చేసుకుంటున్నారు. భౌతిక దూరం పాటిస్తూ.., మాస్కులు ధరించి చర్చిలకు వెళ్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details